దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత కొంత కాలంగా ఊరిస్తోన్న ఈ సేవలు ఎట్టకేలకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక 5జీ సేవలు అందించే విషయంలో భారతీ ఎయిర్టెల్ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ సహా దేశంలోని 8 నగరాల్లో 5జీని అందుబాటులోకి తెస్తున్నట్టు ఈనెల 1వ తేదీన ఎయిర్టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎయిర్టెల్ యూజర్లకు 5జీ ప్లస్ నెట్వర్క్ అందుతోంది. ఎయిర్టెల్ 4జీతో పోలిస్తే.. 5జీ స్పీడ్ 20-30 రెట్లు ఫాస్ట్గా ఉంది. ఆపిల్, ఒప్పో, వన్ప్లస్, షావోమీ, రియల్మీ, శాంసంగ్ కంపెనీలకు చెందిన 5జీ స్మార్ట్ఫోన్స్ వాడుతున్న వారి సెల్ఫోన్లో మాత్రమే 5జీ సింబల్ చూపిస్తోంది. సపోర్ట్ చేయని వాటికి ఓటీఏ(ఒవర్ ది ఎయిర్) అప్డేట్ వస్తుందని కంపెనీ వెల్లడించింది. అలానే మీ సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
ఒకవేళ మీ ప్రాంతంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే.. మీ మొబైల్లో నెటవర్క్ సింబల్ చూపించే దగ్గర 5జీ అని కనిపిస్తుంది. ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ల జాబితా కోసం.. ఈ లింక్ మీద క్లిక్ చేయండి.