టెలికాం రంగంలో నూతన విప్లవానికి తెరలేపనున్న ఐదో తరం సెల్యులార్ నెట్వర్క్ ‘5జీ’ దేశంలో పరుగులు పెట్టనుంది. అందుకు సంబంధించి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాటికి దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన ఆయన, 2023 డిసెంబర్ నాటికి దేశం మొత్తం సేవలను విస్తరిస్తామని వెల్లడించారు.
రిలయన్స్ ఇండస్ట్రీన్ 45వ వార్షిక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జియో 5జీ సేవలపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దివాళీ నాటికి దేశంలోని నాలుగు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా పట్టణాల్లో జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆపై.. డిసెంబర్ 23 తేదీ నాటికి అన్ని పట్టణాలు, తాలూకాలు, తహశీల్లకు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.
జియో 5జీ సేవల కోసం.. 5జీలో లేటెస్ట్ వర్షన్ అయినటువంటి స్టాన్డ్ఎలోన్ టెక్నాలజీని వాడనున్నట్లు రిలయన్స్ జియో చైర్మెన్ ‘ఆకాశ్ అంబానీ‘ తెలిపారు. దీని కోసం జియో సుమారు రెండు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఎటువంటి వైర్లు లేకుండా అల్ట్రా హై స్పీడ్ తో డేటా సేవలు అందుబాటులో ఉంటాయని ఆకాశ్ వెల్లడించారు. అందుకే దీన్ని ‘జియో ఎయిర్ ఫైబర్’ అనే పేరుతో పిలువనున్నట్లు తెలిపారు. జియో 5G సేవలందించేందుకు మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్తో ఒప్పందం చేసుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్.
Jio will deploy the latest version of 5G called ‘standalone 5G’. To build a pan-India true 5G network, Jio will invest Rs 2 lakh crores: Akash Ambani, chairman, Reliance Jio pic.twitter.com/b1Igqwe3I5
— ANI (@ANI) August 29, 2022