5జీ మొబైల్ నెట్వర్క్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు అంతా దీని గురించే చర్చ. ఇప్పటికే ఎయిర్టెల్, జియో కంపెనీలు 5జీ సేవలను ఇప్పటికే టెస్ట్ చేయడం ప్రారంభించాయి. ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 8 నగరాల్లో తమ 5జీ సేవలను ప్రారంభించగా.. జియో కంపెనీ 4 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. నవంబర్, డిసెంబర్ నెలల నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 5జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడ్ వివరాలను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు చాలా మందికి ఈ 5జీ నెట్వర్క్ రావడం లేదు. మీ ఫోన్లో 5జీ ఆప్షన్ ఉన్నా కూడా తమకు 5జీ రావడం లేదని చెబుతున్నారు. నిజానికి 2022లో విడుదలైన మోడళ్లకు మాత్రమే 5జీ సేవలు అందుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ 5జీ నెట్వర్క్ విషయంలో ఫిషింగ్ స్కామ్ జరుగుతోంది.
అదెలా అనుకుంటున్నారా? మీరు 4జీ ఫోన్ వాడుతున్నారా? అయితే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ 5జీ నెట్వర్క్ కు మారిపోతుంది. వెంటనే క్లిక్ చేయండి అంటూ ఏపీకే ఫైల్స్ ని పంపుతున్నారు. కుప్పలు తెప్పలుగా టెలికాం వినియోగదారులకు ఈ ఫైల్స్ ని పంపుతున్నారు. పొరపాటున అయినా మీరు ఆ ఫైల్ క్లిక్ చేస్తే అది మీ ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఆ ఫైల్స్ లో మాల్వేర్ని పంపుతున్నారు. ఆ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవ్వగానే మీ ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లింపోతుంది. మీ సమాచారం తీసుకుని ఖాతాలను ఖాళీ చేసేస్తారు. ఈ 5జీ సేవలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇలాంటి మోసాలు బాగా పెరిగిపోయాయని సైబర్ పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు.
Beware of #5G Upgradation sim scam.
Don’t fall prey to cyber fraudsters who can dupe you on the pretext of upgrading your sims.
Video Courtesy : @Moneypurse pic.twitter.com/OdM2hSqBJy— Telangana State Police (@TelanganaCOPs) October 12, 2022
ప్రస్తుతం 4జీ, 5జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కాబట్టి.. ఆ టెలికాం నెట్వర్క్ యూజర్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. వారి మొబైల్స్ కి ఈ ఏపీకే ఫైల్స్ సెండ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలే కాదు.. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు వంటివి కూడా కలెక్ట్ చేస్తున్నారు. నిజానికి 4జీ ఫోన్ని 5జీగా మార్చడం అనేది జరిగే పని కాదు. 5జీ ఫోన్ ఉండికూడా.. మీకు నెట్వర్క్ రావడం లేదంటే మీ ఫోన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అన్ని మొబైల్ కంపెనీలు 5జీ సేవలు పొందేలా సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. నవంబర్, డిసెంబర్ నాటికి అన్ని కంపెనీలు సాఫ్ట్ వేర్ అప్డేట్ తీసుకొస్తామని తెలియజేశాయి కూడా. కాబట్టి ఇలాంటి ఫిషింగ్ స్కామ్లో పడకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
#5G Scam Alert!
‘5G upgrade’ messages are draining bank accounts.
Beware of #5G related #Cyber Frauds.@diprjk @infjammu @OfficeOfLGJandK @Divcomjammu @districtadmkat1 @CBCKathua @Cyberdost @CyberJammu @Cyberpolicekmr @KathuaPolice @ddiprjammu @PIBSrinagar @Jammu_SmartCity pic.twitter.com/Ms68SCjHgG
— Information & PR, Kathua (@DiprKathua) October 10, 2022
Much needed #awareness!#5G #Cyber #Fraud #scam #beware #janhitmejari #TaarkikLegal pic.twitter.com/H4SweIIRts
— Taarkik Legal (@TaarkikLegal) October 8, 2022