క్రీడాస్ఫూర్తి.. క్రీడా ప్రపంచంలో ఉండాల్సిన అతిగొప్ప లక్షణం. ప్రతీ ఆటగాడికి క్రీడాస్ఫూర్తి ఉండాలి. మైదానంలో తొటి ఆటగాడితో ఎలా ప్రవర్తించాలో కనీస సభ్యత.. ప్రతీ ఆటగాడికి తెలిసి ఉండాలి. అయితే ఇతర దేశాలు పర్యటనకు వచ్చినప్పుడు తమ మాటలతో ఆ దేశ ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం సహజమే. అదీ గాక మైదానంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్లేయర్లు సహనం కొల్పొతుంటారు. దాంతో అప్పుడు వారు తమ నోటికి పనిచెప్పడం.. మనం గతంలో ఎన్నోసార్లు చూశాం. కానీ ఇవన్నీ ఒకెత్తు అయితే.. మనదేశానికే చెందిన ప్లేయర్ ని.. మనదేశ ఆటగాడే స్లెడ్జింగ్ చేస్తే.. మన దేశ ప్లేయరే అతడిని మైదానం లోనుంచి బయటకి పంపిన ఘటన తాజాగా దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో జరిగింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వెస్ట్ జోన్-సౌత్ జోన్ మధ్య జరుగుతోంది. అది మ్యాచ్ చివరి రోజు.. సౌత్ జోన్ బ్యాటర్ అయిన హైద్రాబాద్ కుర్రాడు రవితేజ క్రీజ్ లో ఉన్నాడు. విజయం కోసం టైయిలెండర్లతో కలిసి పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ రవితేజను కవ్వించే ప్రయత్నం చేశాడు. దాంతో రవితేజ అంపైర్లకు ఫిర్యాదు చేయగా అతడిని సముదాయించారు. ఇక ఇంతటితో గొడవ సద్దుమనిగిద్దని అందరు అనుకుంటున్న టైమ్ లో మరోసారి స్లెడ్జింగ్ కు దిగాడు జైశ్వాల్.. దానికి రవితేజ కూడా ధీటుగా బదులిచ్చాడు. ఇద్దరు సిరీయస్ అయ్యి ఒకరిమీదకు ఒకరు వచ్చారు. ఈ క్రమంలోనే కెప్టెన్ రహానే కలుగ జేసుకుని జైస్వాల్ కు వార్నింగ్ ఇచ్చాడు. అతడితో కొంత సమయం మాట్లాడి.. అతడిని మైదానం నుంచి బయటకు పంపాడు. ఆటలో కెప్టెన్ కు ఉన్న రూల్ ప్రకారం రహానే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దీంతో తమ జట్టు ఆటగాడు అని కూడా చూడకుండా.. గ్రౌండ్ నుంచి పంపిన కెప్టెన్ రహానే ను నెటిజన్స్ పొగుడుతున్నారు. “సర్ మీరు నిజంగా క్రీడాస్ఫూర్తిని నిలబెట్టారు.. హ్యాట్సాఫ్ సర్” అని కొందరనగా.. “మిమ్మల్ని చూసి యువక్రికెటర్లు చాలా నేర్చుకోవాలి రహానేజీ” అని మరికొందరు రాసుకొచ్చారు. జైస్వాల్ బయటకి వెళ్లిన కొంత సమయానికే సౌత్ జోన్ జట్టు ఆలౌట్ అయ్యింది. ఇక స్కోర్ల వివరాలకు వస్తే.. వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ లో 270 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 585/4 పరుగులకు డిక్లేర్డ్ ఇచ్చింది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ లో 327 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో 294 పరుగుల తేడాతో వెస్ట్ జోన్ దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్లెడ్జింగ్ చేసిన జైస్వాల్ క్వార్టర్ ఫైనల్, ఫైనల్లో డబుల్ సెంచరీలు చేయడం విశేషం. మరి ఈ మ్యాచ్ లో క్రీడాస్ఫూర్తిని చాటి.. సొంత టీమ్ ఆటగాడినే గ్రౌండ్ నుంచి పంపించి వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Batter Ravi Teja was having some issues with Yashasvi Jaiswal, so after warning him first and seeing it still happen, Captain Ajinkya Rahane tells his own teammate to leave the field!pic.twitter.com/R1sPozKFjF
— 12th Khiladi (@12th_khiladi) September 25, 2022
.@ajinkyarahane88 sent Yashasvi Jaiswal off the field for sledging (earlier gave a warning)😳pic.twitter.com/GvMqvTzYyF
— CricTracker (@Cricketracker) September 25, 2022
West Zone wins the Duleep trophy Final by a huge margin of 294 runs led by a brilliant marathon knock from Yashasvi Jaiswal of 265.#Cricket #CricTracker #AjinkyaRahane #YashasviJaiswal #SouthZone #WestZone #DuleepTrophy2022 pic.twitter.com/uGoDKvn90h
— CricTracker (@Cricketracker) September 25, 2022