విరాట్ కోహ్లీ.. కింగ్ కోహ్లీ.. పరుగుల యంత్రం.. గోట్.. ఇలాంటి పేర్లు, బిరుదులు అతనికి ఊరికే రాలేదు. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ ఓ సంచలనం అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అలాంటి కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎన్నో వైఫల్యాలు, మరెన్నో విమర్శల తర్వాత.. విరాట్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగి కేవలం బ్యాటర్ గానే జట్టులో కొనసాగుతున్నాడు. అయితే బ్యాటర్ గా కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి ఐపీఎల్ సీజన్ తీసుకున్నా కూడా కోహ్లీ ఎంతగానో నిరాశ పరిచాడు. అయితే ఇదంతా కోహ్లీ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఏ మాత్రం ప్రభావం చూపలేదు.
నిజానికి గతం కంటే ఇప్పుడు కోహ్లీకి ఫాలోయింగ్, క్రేజ్, సపోర్ట్ పెరిగింది. అందుకు ఉదారణగా అతని ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి చెప్పుకోవచ్చు. జూన్ 7 మంగళవారంనాడు కింగ్ కోహ్లో సోషల్ మీడియాలో అరుదైన ఘనత సాధించాడు. ఇన్ స్టాగ్రామ్ లో 200 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న తొలి భారతీయుడిగా రికార్డుల కెక్కాడు.
అంతేకాదు.. క్రికెట్ ప్రపంచంలోనే ఇన్ స్టాగ్రామ్ లో 200 మిలియన్ ఫాలోవర్లు ఉన్న తొలి క్రికెటర్, ఆసియా ఖండంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తి కూడా కోహ్లీనే. ఫుట్ బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో(450 మిలియన్), లియోనల్ మెస్సీ(333 మిలియన్) తర్వాత 200 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న క్రీడాకారుడు కూడా విరాట్ కోహ్లీనే. ఈ విషయంపై స్పందిచిన కోహ్లీ.. ‘200 మిలియన్ స్ట్రాంగ్.. ఇంతటి భారీ మద్దతు ఇస్తున్నందుకు ఇన్ స్టాగ్రామ్ ఫ్యామిలీకి ధన్యవాదాలు’ అంటూ కోహ్లీ తెలిపాడు.
ఇంక సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కు కోహ్లీ సహా రోహిత్, జడేజా, మహ్మద్ షమీ వంటి సీనియర్లకు విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. జూన్ 9న ఢిల్లీ వేదికగా సౌత్ ఆఫ్రికా- టీమిండియా తొలి టీ20 జరగనుంది. రెండు జట్లలో స్ట్రాంగ్ ప్లేయర్లు ఉండటంతో ఈ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. తొలి టీ20లో విజయం ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.