టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్నాడు. కొంతమంది మత ఛాందసవాదులు షమీపై విరుచుకుపడుతున్నారు. క్షమించరాని తప్పు చేశావంటూ మండిపడుతున్నారు. ఇంత వ్యతిరేకత తన మతం వారి నుంచే వ్యక్తం అయ్యేలా షమీ అంత పెద్ద తప్పు చేశాడో అని ఆలోచిస్తున్నారా? షమీ చేసిన పని ఏంటో తెలిస్తే.. షాక్ అవుతారు. ఈ విషయానికా షమీపై ఇంత దేష్వం చిమ్ముతున్నారా? అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఇంతకీ షమీ ఏం చేశాడంటే..
దసరా పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఆ రాయుడు మీ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ప్రార్థన చేస్తాను. మీకు, మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలు’ తెలుపుతూ.. రావణుడ్ని సంహరిస్తున్న రాముడి ఫొటోను షేర్ చేశాడు. ఇదే షమీ చేసిన తప్పైపోయింది. ఈ ఫొటో షమీ షేర్ చేయడాన్ని కొంతమంది మతఛాందసవాదులు తప్పుబడుతున్నారు. ఏదో జరగరాని ఘోరం జరిగిపోయినట్లు తెగహైరనా పడిపోతూ.. షమీని తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల నీన్ను జట్టులోకి తీసుకోరులే అంటూ మూర్ఖంగా మాట్లాడుతున్నారు.
ఇక్కడ వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. షమీ జాతీయ క్రికెటర్. అతన్ని ఒక మతానికి అంటగట్టి చూడటం తప్పు. అతను అందరి ఆస్తి. అతని మత ఆచారాలను అతను పాటిస్తూ.. వేరే మతం వారి పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలపడమే నేరమంటే ఎలా. అయినా.. వేరే మతస్థులు తమ పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలిపిన సమయంలో.. థ్యాంక్యూలు చెబుతూ రిట్వీట్లు చేసే వాళ్లు ఇప్పుడు షమీ దసరా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపితే మాత్రం సహించలేకపోతున్నారా? అంటూ మరికొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో షమీకి మద్దతుగా స్పందిస్తున్నారు.
On the happy occasion of Dussehra, I pray that Lord Ram fills your life with lots of happiness, prosperity, and success. Happy Dussehra to you and your family. #mdshami11 #Dussehra pic.twitter.com/wsFk7M1Gj5
— Mohammad Shami (@MdShami11) October 5, 2022
ఇది కూడా చదవండి: కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక పూజలు.. టార్గెట్ టీ20 వరల్డ్ కప్!