పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ 2022లో ఆడని విషయం తెలిసిందే. మోకాలి గాయానికి లండన్లో శస్త్రచికిత్స చేయించుకున్న షాహీన్ అఫ్రిదీ టీ20 వరల్డ్ కప్ రెడీ అయ్యాడు. మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానుంది. దీని కోసం దాదాపు అన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకున్నాయి. కాగా.. పాకిస్థాన్ పక్కనే ఉన్న న్యూజిలాండ్లో బంగ్లా, కివీస్తో ట్రైసిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా చేరుకోనుంది. అయితే.. ఈ సిరీస్కు కూడా అఫ్రిదీకి రెస్ట్ ఇచ్చారు. దీంతో అతను నేరుగా టీ20 వరల్డ్ కప్లోనే ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో తనకు దొరికిన రెస్ట్ టైమ్లో జాలీగా గడుపుతున్న అఫ్రిదీ.. తాజాగా ఒక పోస్టుతో కాకరేపాడు.
కళ్లజోడు పెట్టుకుని, మంచి పర్యాటక ప్రాంతంలో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఒక ఫొటోను పోస్టు చేశాడు. ఆ ఫొటోకు ‘కామ్ బిఫోర్ ది స్ట్రోమ్’అనే క్యాప్షన్ ఇచ్చాడు. దాని పక్కనే బ్యాట్ బాల్ ఎమోజీ కూడా జోడించాడు. అంటే టీ20 వరల్డ్ కప్లో తుఫాను సృష్టించబోతున్నట్లు అఫ్రిదీ పేర్కొన్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫొటోలో ఉన్న కామ్నెస్.. రాబోయే తుఫాన్ను సూచన అనేది అఫ్రిదీ ఉద్దేశం. అయితే టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియాతో పాటు అన్ని జట్ల బ్యాటర్లకు అఫ్రిదీ వార్నింగ్ ఇచ్చాడంటూ కొంతమంది పాక్ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే వరల్డ్ కప్లో పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్ను టీమిండియాతోనే ఆడనుంది. ఈ నెల 23న మెల్బోర్న్ వేదికగా ఈ మెగా ఫైట్ జరగనుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్లో షాహీన్ అఫ్రిదీ మంచి ప్రదర్శన కనబర్చాడు. టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని అవుట్ చేసి భారత్ను దెబ్బతీశాడు. మళ్లీ ఆ తర్వాత భారత్తో ఆసియా కప్లో అఫ్రిదీ ఆడలేదు. తిరిగి టీ20 వరల్డ్ కప్ 2022లోనే భారత్ను ఢీకొనబోతున్నాడు. అందుకే గతేడాది సీన్ను మళ్లీ రిపీట్ చేస్తాననే ఉద్దేశంతో అఫ్రిదీ ఈ పోస్టు పెట్టినట్లు క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక.. పోస్టులు కాదు.. గ్రౌండ్లో చూసుకుందాం అంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ధీటుగా బదులిస్తున్నారు.
Calm before the storm 🏏 pic.twitter.com/pLtd85tOyR
— Shaheen Shah Afridi (@iShaheenAfridi) October 6, 2022
ఇది కూడా చదవండి: వారిని వీధి కుక్కలతో పోల్చిన బుమ్రా.. వైరల్ గా మారిన ఇన్స్టా పోస్ట్!