ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ అభిమానులు కోపంగా ఉన్నారు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరపరాజయాన్ని చవిచూసింది. పసికూన బంగ్లాదేశ్పై టీమిండియా ఓడిపోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆదివారం ఢాకా వేదికగా బంగ్లాతో తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. టాపార్డర్, లోయర్ ఆర్డర్ విఫలం అవ్వడంతో 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయింది. పిచ్ బ్యాటింగ్కు టఫ్గా ఉండటంతో టీమిండియా బౌలర్లు సైతం బంగ్లాదేశ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఒకనొక దశలో 136 పరుగులకే బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బంగ్లాదేశ్ మ్యాచ్ గెలుస్తుందని ఏ ఒక్కరూ అనుకోలేదు. కానీ.. మెహిదీ మిరాజ్ విరోచిత పోరాటంతో ముస్తఫీజుర్ రెహమాన్తో కలిసి 10వ వికెట్కు ఏకంగా 51 పరుగులు జోడించి మ్యాచ్ గెలిచించాడు.
ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్ ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా.. ఇప్పుడు బంగ్లాదేశ్పై కూడా ఓడిపోవడంతో క్రికెట్ అభిమానులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో మార్పులపై తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నారు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ల ఎంతో మంది టీమిండియాలో స్థానం కోసం ఎదురు చూస్తున్నా.. కేఎల్ రాహుల్ చేత వికెట్ కీపింగ్ చేయించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ను ఒంటి చేత్తో గెలిపించిన మెహిదీ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇచ్చిన ఒక క్యాచ్ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. ఇదే మ్యాచ్ ఓడిపోవడానికి అసలు కారణం అంటూ ఫ్యాన్స్ కేఎల్ రాహుల్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో రిషభ్ పంత్ను జట్టు నుంచి తప్పిస్తూ.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయం మ్యాచ్కు ముందే వెల్లడించింది బీసీసీఐ. మెడికల్ టీమ్ సిఫారసు మేరకు పంత్ను వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా పంత్ మెడనొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. బహుషా ఆ కారణంతోనే పంత్కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. పంత్ తిరిగి టెస్టు సిరీస్కు అందుబాటులో ఉంటాడని సైతం బీసీసీఐ పేర్కొంది. కాగా.. రిషభ్ పంత్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న పంత్ను టీమ్ నుంచి తప్పించాలని క్రికెట్ అభిమానుల నుంచి కూడా డిమాండ్ వ్యక్తం అవుతోంది. అతని స్థానంలో సంజు శాంసన్ను తీసుకోవాలని కూడా ఫ్యాన్స్ అభిప్రాడుతున్నారు. అయితే.. పంత్ను ఇంటికి పంపిన బీసీసీఐ.. అతని స్థానంలో ఎవరీ తీసుకోవడం లేదని కూడా తెలిపింది.
🚨 UPDATE
In consultation with the BCCI Medical Team, Rishabh Pant has been released from the ODI squad. He will join the team ahead of the Test series. No replacement has been sought
Axar Patel was not available for selection for the first ODI.#TeamIndia | #BANvIND
— BCCI (@BCCI) December 4, 2022