గౌతమ్ గంభీర్.. గత కొద్ది రోజులుగా నిత్యం మీడియాలో నిలుస్తున్నాడు. టీమిండియా టీ20 జట్టు సెలక్షన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి మనకు తెలిసిందే. అదీ కాక తాజాగా సోషల్ మీడియా ఫాలోవర్స్ విషయంలో కూడా గంభీర్ ఘాటుగానే స్పందించాడు. ఇక ఇప్పటికే గౌతమ్ కి ముక్కుసూటి మనిషిగా పేరుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి గంభీర్. ఈ క్రమంలోనే ఈసారి తన విమర్శలను ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపైనే ఎక్కుపెట్టాడు. ఆ విమర్శలకు వేదికగా నిలిచింది IPL. మరి గంగూలీపై విమర్శలకు దారితీసిన పరిస్థితుల గురించి వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL).. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ క్రీడాభిమానులకు అదో ఉత్సవం. ఐపీఎల్ ప్రారంభం అవుతుంది అంటే చాలు అభిమానులు వేయి కళ్లతో దాని కోసం ఎదురుచూస్తారు. అయితే ఐపీఎల్ లో ఎక్కువ స్పాన్సర్ షిప్ డబ్బులు గేమింగ్ ప్లాట్ ఫామ్స్ అయిన డ్రీమ్ 11, May 11 సర్కిల్, మరికొన్ని వెబ్ సైట్ల ద్వారానే వస్తుందని గంభీర్ పేర్కొన్నాడు. ఈ గేమింగ్ ప్లాట్ ఫామ్ లకు సంబంధించిన అడ్వర్టైజ్ ల విషయాలను గంగూలే చూసుకుంటున్నట్లు గంభీర్ తెలిపాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల గురించి ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గంభీర్ మాట్లాడుతూ..”సాక్ష్యాత్తు బీసీసీఐ అధ్యక్షుడే డ్రీమ్ 11, మై లెవెన్ సర్కిల్ లాంటి గేమింగ్ ప్లాట్ ఫామ్స్ కు యాడ్స్ చేస్తుంటే.. మీగతా ఆటగాళ్లు ఎందుకు చేయరు? వాళ్లకి మాత్రం ఆ ఆలోచనలు ఉండవా? ఒకవేళ బోర్డు పెద్దలు వాటికి ప్రకటనలు ఆపేయాలి అనుకుంటే ముందు గంగులీనే మానేయాలి.. తర్వాత దానిని అందరి ఆటగాళ్లకు వర్తింప జేయాలి” అంటూ సీరియస్ అయ్యాడు.
ఇక అది సాధ్యం కాకపోతే పూర్తిగా గేమింగ్ సైట్లను నిషేధించాలి. ఈ ఫాంటసీ గేమ్ లతో కొన్ని లక్షల మంది తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. దాంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసి.. మరి కొన్ని రాష్ట్రాల్లో వీటిని నిర్వహిస్తే ఎలా?” అంటూ ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఈ గేమింగ్ యాప్స్ పై నిషేధం కొనసాగుతోంది. అయితే ఐపీఎల్ ప్రారంభం నుంచి డ్రీమ్ 11, మై 11 సర్కిల్, MPL లాంటి గేమింగ్ ప్లాట్ ఫామ్స్ చాలా మంది ఆటగాళ్లు ప్రకటనలు చేశారు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ ఈ యాప్స్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
‘What is our vision for Delhi? How much work we do on ground is how we create the narrative’
Here’s what @GautamGambhir spoke about at the latest edition of Idea Exchange, moderated by @Abhinavrt.https://t.co/uTNd0EJ1L3
— The Indian Express (@IndianExpress) September 19, 2022