సినిమా రిలీజ్లప్పుడు హీరోలకు భారీ భారీ కటౌట్లు పెడుతుంటారు. ఆ హీరో కంటే తమ హీరో కటౌట్ ఎక్కువ ఎత్తులో ఉండాలని, సినిమా సినిమాకు ఎత్తు పెంచడం లాంటి సినిమా అభిమానులు చేస్తుంటారు. కానీ.. ఈ సంస్కృతి ఇప్పుడు క్రికెట్కు కూడా పాకినట్లు ఉంది. మొన్నామధ్య ఆంధ్రలో టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని పుట్టిన రోజు సందర్భంగా భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ధోని అభిమానులు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటి క్రికెటర్లకు కూడా కటౌట్లు పెడతారా అని ఆశ్యర్యపోయేలా చేశారు. తాజాగా ఇండియా-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి తిరువనంతపురంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ బుధవారం(సెప్టెంబర్ 28) అక్కడ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియానికి వెళ్లే దారిలో కోహ్లీ అభిమానులు ఈ భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు.
విరాట్ కోహ్లీ కటౌట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గత కొంత కాలంగా సరైన ఫామ్లో లేని కోహ్లీ ఇటివల జరిగిన ఆసియా కప్, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్తో ఫామ్లోకి వచ్చాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ అభిమాన ఆటగాడు అదరగొడుతుండడంతో తిరువనంతపురంలోని కోహ్లీ ఫ్యాన్స్ ఈ కటౌట్ను ఏర్పాటు చేశారు. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్లో కూడా కోహ్లీ భారీగా పరుగులు చేయాలని ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు అభిమానులు పేర్కొన్నారు. కాగా.. కోహ్లీ కటౌట్ విషయం హాట్ టాపిక్గా మారిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్కు వెళ్లే దారిలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారీ కటౌట్ ప్రత్యక్షమైంది.
ఇలా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కటౌట్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో క్రికెట్ అభిమానులంతా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ.. కోహ్లీ కటౌట్కు పోటీగానే రోహిత్ కటౌట్ ఏర్పాటు చేశారనే విషయంపై కోహ్లీ-రోహిత్ ఫ్యాన్స్ మధ్య సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధం మొదలైంది. కోహ్లీ కటౌట్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కెప్టెన్సీ లేకపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటూ కోహ్లీ ఫ్యాన్స్ పేర్కొనండంతో రోహిత్ ఫ్యాన్స్ సైతం అప్పటికప్పుడు భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. రోహిత్ కటౌట్ చూసిన కొంతమంది కోహ్లీ ఫ్యాన్స్.. ‘కోహ్లీ కటౌట్ చూసి తన కటౌట్ కూడా పెట్టమని రోహిత్ శర్మ డబ్బులు పంపాడా?’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇలా కోహ్లీ-రోహిత్ మధ్య కటౌట్ వార్తో పాటు మాటల యుద్ధం కూడా జరుగుతోంది. సినిమాకే పరిమితమైన ఈ కటౌట్ల కల్చర్ ఇప్పుడు క్రికెట్కు కూడా పాకడంపై కొంతమంది క్రికెట్ అభిమానలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ-రోహిత్ ఇద్దరూ ఆడేది టీమిండియాకే అయినా ఎందుకు ఇలాంటి వివాదాలంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. కాగా.. రోహిత్ కటౌట్ను ఆల్ కేరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి రోహిత్కు ఎలాంటి సంబంధంలేదు. కోహ్లీ-రోహిత్ ఎలాంటి స్నేహం ఉందో ఆస్ట్రేలియాతో ఆదివారం ఉప్పల్లో జరిగిన చివరి టీ20తోనే మరింత స్పష్టం అయింది. అయినా కొంతమంది అభిమానులు ఇలా రోహిత్-కోహ్లీ అంటూ గొడవ పడటం సరికాదు.
🔥🔥🔥The cutout is here 🔥💥
Mass God Rohit Sharma’s cutout placed in Kerala 🔥😍 pic.twitter.com/P2xFzoCoCw
— Rσყαɭ Ɗ Ơ Ɲ ᴹᴵ ⚔️ ♡ (@itz_don_) September 27, 2022
Huge cutout of Virat Kohli at Trivandrum Greenfield International stadium. #INDvSA #ViratKohli #Trivandrum pic.twitter.com/XyymEMPLgg
— Deepu (@deepuva24) September 27, 2022
ఇది కూడా చదవండి: పాకిస్థాన్ తరఫున భారత్కు ఇంగ్లండ్ రిక్వెస్ట్! BCCI రిప్లై ఇదే..