ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఎలాంటి క్రేజ్ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అదో మినీ యుద్ధం. పాక్ ఓడితే భారత్లో, ఇండియా ఓడితే పాకిస్థాన్లో సంబురాలు అంబరాన్ని అంటుతాయి. ఓడిన జట్టుపై ఆ దేశ అభిమానులే ఒక రేంజ్లో విమర్శలు గుప్పిస్తారు. ఓటమికి కారణమైన ప్లేయర్ను దారుణంగా ట్రోల్ చేసి పడేస్తారు. ఎందుకంటే ఇండియా-పాకిస్థాన్ను మ్యాచ్ ఒక క్రికెట్ మ్యాచ్లా కాకుండా పరువులా ఫీలవుతారు, శత్రువుతో చేసే యుద్ధంలా భావిస్తారు. అందుకే భారత్-పాక్ మ్యాచ్కు అంత క్రేజ్, డిమాండ్ ఉంటుంది. క్రికెట్ అభిమానులకు ఫుల్ వినోదంతో పాటు బోర్డులకు భారత్-పాక్ మ్యాచ్ ఒక బంగారు బాతు. ఆర్థికంగా ఫుల్ ఫాయిదా ఉంటుంది.
కానీ.. కొన్నేళ్ల నుంచి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోవడంతో పాకిస్థాన్ ఆర్థికంగా నష్టపోతుంది. బీసీసీఐకి మాత్రం ఆ టెన్షన్ లేదు. ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డు బీసీసీఐనే. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడకపోవడం వల్ల పాక్ బోర్డుకే ఎక్కువ నష్టం. ఐసీసీ ఈవెంట్స్లో ఈ రెండు దేశాలు తలపడుతున్నా.. దాని వల్ల పెద్దగా ప్రయోజం ఉండదు. దీంతో ఎలాగైన భారత్తో సిరీస్లు ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. కానీ.. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు దేశాల మధ్య సిరీస్కు అనుమతి లేదు. ఈ నిబంధనను బీసీసీఐ తూచా తప్పకుండా పాటిస్తుంది. దీంతో పాకిస్థాన్ నేరుగా భారత క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపే సీన్ లేకపోవడంతో కొత్త ప్లాన్తో ముందుకు వచ్చింది.
భారత్-పాక్ మధ్య సిరీస్లు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి బీసీసీఐకి రిక్వెస్ట్ వచ్చేలా చేసినట్లు సమాచారం. భారత్-పాక్ మధ్య సిరీస్లతో అటు పాకిస్థాన్తో పాటు ఇటు ఇంగ్లండ్ కూడా నాలుగు పైసలు వెనకేసుకోవచ్చని ప్లాన్తో ఈ రాయబారం జరిపింది. కానీ.. ఇంగ్లండ్ బోర్డు చేసిన ప్రతిపాదనను బీసీసీఐ కరాఖండిగా తిరస్కరించినట్లు సమాచారం. పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. కాగా.. ఇటివల యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022లో భారత్-పాకిస్థాన్ రెండు మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఒక మ్యాచ్లో భారత్, మరో మ్యాచ్లో పాక్ గెలిచిన విషయం తెలిసిందే. అంతకు ముందు టీ20 వరల్డ్ కప్ 2021లో తలపడ్డ ఈ దాయాదులు.. మళ్లీ ఆసియా కప్లోనే పోటీ పడ్డాయి. తిరిగి టీ20 వరల్డ్ కప్ 2022లో అక్టోబర్ 27న జరగబోయే మ్యాచ్లో తలపడనున్నాయి.
ECB offer to host India and Pakistan Test series in England https://t.co/Lj7TSgVWv7
— Nick Hoult (@NHoultCricket) September 27, 2022
ఇది కూడా చదవండి: కోహ్లీ పై అభిమానుల ప్రేమ.. మైదానం ముందు భారీ కటౌట్!