208 రన్స్.. టీ20ల్లో భారీ స్కోరే.. ఎవరైనా ఇంత స్కోరు చేశాక గెలవడం సులభమే అని అనుకుంటారు. కానీ మంగళవారం జరిగిన మ్యాచ్ లో బొమ్మ తిరగబడింది. 209 పరుగులను కాపాడుకోలేక టీమిండియా చేతులెత్తేసింది. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడిపోయింది. భారత్ ఓడిపోయింది.. అనడం కంటే దగ్గరుండి ఆస్ట్రేలియాను గెలిపించింది అనడం ఉత్తమం. తాజాగా మెుహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అప్పటికీ ప్యాట్ కమిన్స్ భారత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. స్టార్ ప్లేయర్లు దూరం అయినా గానీ మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి అని. ఆ మాటను టీమిండియా ఆటగాళ్లు ఉత్తి గాలి మాటగానే తీసుకున్నట్లు తాజాగా రుజువైంది. కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లు టీమిండియా ఓటమికి కూడా 5 కారణాలు ఉన్నాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్.. జట్టులోని ఆటగాళ్లందరూ సమష్టిగా రాణిస్తేనే విజయం వరిస్తుంది. ఈ జెంటిల్ మెన్ గేమ్ లో ఏ ఒక్కరో ఆడితే మ్యాచ్ గెలవడం జరగదు. అలా జరిగిన సందర్భాలూ చాలా అరుదుగానే ఉన్నాయి. క్రికెట్ లో టీమ్ మెుత్తం రాణించాలి.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వ్యూహాలు.. ప్రతివ్యూహాలు లాంటి వాటిల్లో పై చేయి సాధిస్తేనే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇక తాజాగా ఆసిస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలం అయ్యింది. ఇక టీమిండియా ఓటమిని శాసించిన ఆ 5 కారణాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం..
1. చెత్త ఫీల్డింగ్
“టేక్ ది క్యాచ్.. విన్ ది మ్యాచ్..” ఈ సూత్రం క్రికెట్ ప్రపంచానికి ఓ భగవద్గీత. ఈ సూత్రాన్ని మరిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇది వరకే ఆసియా కప్ లో భారత్ తెలిసివచ్చింది. కానీ తన తీరును మాత్రం టీమిండియా మార్చుకోనట్లే కనిపిస్తోంది. గతంలో టీమిండియా అంటేనే శత్రు దుర్భ్యేద్యమైన ఫీల్డింగ్ కు పెట్టింది పేరు. మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, రవింద్ర జడేజా, సురేష్ రైనా.. లాంటి మెరుపు లాంటి ఆటగాళ్లు గుర్తుకు వస్తారు. కానీ ఇటీవలి కాలంలో టీమిండియా తీరు మారింది. సులభమైన క్యాచ్ లను కూడా నేలపాలు చేస్తూ మ్యాచ్ లను ప్రతర్థులకు చేజేతులా అప్పగిస్తున్నారు. తాజాగా జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కామెరోన్ గ్రీన్ 42 పరుగుల వద్ద ఇచ్చిన సులభమైన క్యాచ్ ను అక్షర్ పటేల్ అందుకోలేకపోయాడు. లాంగాఫ్ లో స్మిత్ ఇచ్చిన క్యాచ్ ను కూడా రాహుల్ ఒడిసిపట్టడంలో విఫలం అయ్యాడు. కీలక ఇన్నింగ్ ఆడిన మాథ్యూ వేడ్ 18వ ఓవర్లో ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను హర్షల్ పటేల్ పట్టుకోలేదు. దాంతో అతడు మ్యాచ్ స్వరూపాన్నే మార్చి.. ఆసిస్ కు విజయాన్ని అందించాడు.
2. గ్రీన్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయకపోవడం..
ఆల్ రౌండర్ కామెరోన్ గ్రీన్ భారత్ తో మ్యాచ్ లో 30 బంతుల్లో 61 రన్స్ చేసి ఆసిస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు ఒకసారి అవుట్ అయ్యాడు. ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. చాహల్ బౌలింగ్ గ్రీన్ ఎల్బీడబ్ల్యూ గా వికెట్ల ముందే దొరికిపోయాడు. కానీ కీపర్ డీకే గానీ, బౌలర్, రోహిత్ శర్మ సైతం ఎవరూ అంపైర్ కి అప్పీల్ చేయలేదు. తర్వాత తీరా రిప్లైలో చూస్తే అది అవుట్ అని తేలింది. అప్పటికి అతడు 26 పరుగుల వద్ద ఉన్నాడు. ఇది టీమిండియా చేసిన మరో తప్పు.
3. ఉమేశ్ యాదవ్ ను తీసుకోవడం..
ఉమేశ్ యాదవ్ ఈ మ్యాచ్ లో 2 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఉమేశ్ తన తొలి 8 బంతుల్లోనే 26 రన్స్ ఇవ్వగా.. రెండో ఓవర్ లో పుజుకుని స్మిత్, మ్యాక్స్ వెల్ ని అవుట్ చేశాడు. అదీ రోహిత్ శర్మ డిఆర్ఎస్ కోరడంతో వాళ్లు పెవిలియన్ కు చేరారు. అయితే టీ20 ప్రపంచ కప్ జట్టులో లేని ఉమేశ్ ఎలా ఈ సిరీస్ కు తీసుకున్నారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఉమేశ్ బదులుగా చాహర్ ను తీసుకున్నా మంచిగా ఉండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. యాదవ్ ను తీసుకోవడం కూడా భారత ఓటమికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
4. బౌలర్ల వైఫల్యం..
“170-180 పరుగులను కాపాడుకోలేక పోయిన భారత బౌలర్లను వరల్డ్ క్లాస్ బౌలర్లు అని అనడంలో అర్ధం లేదు” వీరేంద్ర సెహ్వాగ్ ఆసియా కప్ లో పేలవ ప్రదర్శన తర్వాత భారత బౌలర్ల పై చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలను అక్షరాలా ఆసిస్ తో జరిగిన మ్యాచ్ లో నిరూపించారు. భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లపై ఏ మాత్రం ప్రభావం చూపించ లేక పోయారు. భువీ, హర్షల్ కలిసి 8 ఓవర్లో 101 పరుగులు సమర్పించుకున్నారు అంటేనే మన బౌలింగ్ ఎలా ఉందో అర్దం అవుతోంది. టీమిండియా బౌలర్లు అందరూ ఆసియా కప్ వైఫల్యాన్ని కొనసాగించారు. దాంతో టీమిండియా ఓటమి లాంఛనమే అయ్యింది. అక్షర్ పటేల్ ఒక్కడే 3/17 తో రాణించాడు.
5. కొంప ముంచిన డెత్ ఓవర్లు..
డెత్ ఓవర్ల వైఫల్యం కొనసాగుతూనే ఉంది. వికెట్లు తీయడం అటుంచితే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 17వ ఓవర్లో 15 రన్స్.. 18వ ఓవర్లో 22 రన్స్.. 19వ ఓవర్లో 16 పరుగులు. ఈ గణాంకాలు చూస్తేనే తెలుస్తోంది టీమిండియా డెత్ ఓవర్లలో ఎంత తేలిపోయిందో అని. 18వ ఓవర్లో చెలరేగిన వేడ్ 22 రన్స్ చేసి ఆసిస్ విజయాన్ని ముందే నిర్ణయించాడు. ఇక భారత్ టీ20 వరల్డ్ కప్ ముందు ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అటు అభిమానులకు, ఇటు జట్టుకు తీవ్ర నిరాశను మిగుల్చుతోంది. వచ్చే మ్యాచ్ లోనైనా ఈ లోపాలను సవరించుకొని టీమిండియా ముందుకెళ్లాలని ఆశిద్దాం. టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Things went right down to the wire but it’s Australia who won the first #INDvAUS T20I.#TeamIndia will look to bounce back in the second T20I.
Scorecard 👉 https://t.co/ZYG17eC71l pic.twitter.com/PvxtKxhpav
— BCCI (@BCCI) September 20, 2022
𝗬𝗼𝘂 𝗝𝘂𝘀𝘁 𝗖𝗮𝗻 𝗡𝗼𝘁 𝗠𝗶𝘀𝘀 𝗧𝗵𝗶𝘀! @hardikpandya7 creamed 7⃣ Fours & 5⃣ Sixes to hammer 7⃣1⃣* off 3⃣0⃣ balls! ⚡️ 🎇 #TeamIndia | #INDvAUS
Watch that stunning knock 🔽https://t.co/C1suCKBPK7 pic.twitter.com/3o86bZEIzn
— BCCI (@BCCI) September 20, 2022