రాజకీయ నాయకులు అనగానే ఎన్నికల ముందు కనిపిస్తారు.. ఆ తర్వాత మళ్లీ ప్రజల ముందుకు రారు. వారి సమస్యలను పట్టించుకోరు. ఎన్నికల వేళ ప్రజల చుట్టూ నేతలు తిరిగితే.. వారు గెలిచాకా.. ప్రజలు నాయకులను కలవడానికి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎన్ని రోజులు నిరీక్షించినా ఫలితం ఉండదు. మళ్లీ ఎన్నికల ప్రచారం సమాయానికి జనాల ముందుకు వస్తారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తాపత్రయ పడతారు. జనాల మేలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడమే కాక.. వాటి అమలు తీరు, ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఆరా తీయాడానికి ఏకంగా నాయకులనే రంగంలోకి దింపారు. అందుకోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫలితంగా నేతలంతా వారి వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ చర్యలు, పథకాల గురించి జనాలకు వివరిస్తూ.. వారి సమస్యలు విని పరిష్కరిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఒంగోలులో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఓ పేదింటి విద్యార్థిని జీవితంలో వెలుగులు నింపింది. ఆమె భవిష్యత్తకు భరోసా కల్పించింది. ఇంతకు ఏం జరిగింది అంటే.. వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని 49వ డివజన్లో సత్యనారాయణ పురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు నందిని అనే పేద విద్యార్థిని కష్టం గురించి తెలిసింది. పదో తరగతితో 550కి పైగా మార్కులు సాధించిన నందిని ఆర్థిక సమస్యల కారణంగా కాలేజీలో జాయిన్ కాలేదు.
విషయం తెలుసుకున్న బాలినేని.. ఇంత టాలెంట్ కలిగిన విద్యార్థిని పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదని భావించారు. వెంటనే ఒంగోలులోని ఓ ప్రైవేట్ కాలేజీకి కాల్ చేసి.. నందిని సీటు ఇప్పించారు. ఆమె చదువుకయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని మాట ఇచ్చారు. అంతేకాక నందిని ఎంత వరకు చదివితే.. అంతవరకు ఆమెను చదివించే బాధ్యత తనదే అంటూ బాలినేని భరోసా ఇచ్చారు. పేద విద్యార్థినిని ఆదుకున్న బాలినేని మంచి మనసుపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి బాలినేని చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.