Andhra Pradesh: ఓ ఇంటిపెద్ద తీసుకునే నిర్ణయంపై ఆ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలానే అత్యున్నత పీఠంపై ఉన్న నాయకుడు తీసుకునే ఆలోచనలపై ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయం జనాలకు మేలు చేసేది అయితే పదుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని అతడు చూపిన బాటలో మరి కొందరు నడుస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయి. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా ముందుకు తీసుకెళ్తానన్న దాన్ని పాదయాత్ర సమయంలో ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చాక.. నాడు తాను చెప్పిన దాని కన్నా మిన్నగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ.. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సీఎం జగన్.
ఇక సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతోంది. మరీ ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. విద్యారంగంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రజల జీవితాలు బాగుపడాలన్నా.. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలన్నా.. మొత్తంగా సమాజం అభివృద్ధి చెందాలంటే కావాల్సింది నాణ్యమైన విద్యను అందించడం. పిల్లలకు మనమిచ్చే అతి గొప్ప ఆస్తి చదువు. విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించగలిగితే.. ఇక వారి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. తద్వారా ఓ తరం తలరాత మారిపోతుంది. సీఎం జగన్ ఇదే నమ్ముతారు. నమ్మడమే కాదు.. దాన్ని ఆచరణలో కూడా పెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన తొలి ప్రాధాన్యతను విద్యారంగానికి ఇచ్చారు. దాని ఫలితమే నేడు మనం చూస్తున్న సంస్కరణలు.
పిల్లల చదువు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే పేద విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులు. అలానే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు, షూస్, యూనిఫామ్, బ్యాగ్ ఇలా విద్యార్థులకు కావాల్సిన వాటన్నింటిని ఉచితంగా అందజేస్తున్నారు. ఇక విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ మొత్తాన్ని భారీగా పెంచారు.. అలానే హాస్టల్ విద్యార్థులకు రుచికరమైన, పౌష్టిక ఆహారం అందించేలా మెనులో మార్పలు చేశారు. ఇక విద్యారంగంలో తీసుకువచ్చిన అతి ముఖ్యమైన సంస్కరణల్లో మరో ముఖ్యమైన అంశం మన బడి నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తీర్చిదిద్దడం కోసం సీఎం జగన్ తీసుకువచ్చిన కార్యక్రమం నాడు నేడు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల కింద ఉన్న 44,512 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా టాయిలెట్ల నిర్మాణం చేపట్టడం, తరగతి గదులన్నింటిలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ చేయడం, సురక్షిత తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం సరిపడా ఫర్నిచర్, అన్ని పాఠశాలకు పెయింటింగ్, అవసరమయిన స్కూళ్లకు పెద్ద, చిన్న మరమ్మతులు చేయించడం, అన్ని స్కూల్స్లో ఆకుపచ్చ సుద్ద బోర్డులతో పాటు ఇంగ్లీష్ ల్యాబ్స్, పాఠశాలలకు కాంపౌండ్ గోడలు ఏర్పాటు చేయడం చేస్తున్నారు. మొదటి ఫేజ్లో భాగంగా 15,715 పాఠశాలలలో ఈ కార్యక్రామాన్ని అమలు చేశారు. దీనికి దాదాపు రూ. 3700 కోట్లు ఖర్చు అయ్యింది.
ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఒకప్పుడు పాడుబడిన భవనాలు.. ఆవరణలో పిచ్చి మొక్కలు, విరిగిన కుర్చీలు, బల్లలు, బలమైన గాలులు వస్తే కూలిపోయే పైకప్పులు, అపరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్ల స్థానంలో నేడు అత్యాధునిక సౌకర్యాలు వచ్చాయి. ఆకర్షణీయమైన రంగులతో.. సకల సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారాయి. ఇక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆంగ్ల మీడియం మంచి ఫలితాలు ఇస్తోంది. ఫలితంగా ఇప్పటి వరకు అప్పులు చేసి మరి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపే తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రభుత్వ పాఠశాలకు పంపేందకు ఇష్టపడుతున్నారు. పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపడటంతో డ్రాపౌట్ల సంఖ్య కూడా తగ్గింది.
ఇక సీఎం జగన్ ప్రారంభించిన నాడు నేడు మంచి ఫలితాలను ఇవ్వడమే కాక.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలో కేంద్రం ఏపీ స్ఫూర్తితో కేంద్రంలో పీఎం శ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోబోతోంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణలపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కొడాలి నానిని ఎలా చంపబోతున్నారు.. బుద్ధా వెంకన్నకు జాఫర్ సూటి ప్రశ్న