వైసీపీ ఫైర్ బ్రాండ్, మినిస్టర్ రోజా మరోసారి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ ఒక పిల్లి పిత్రే అని.. అలాంటి వాడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వాడు, వీడు అంటే పళ్లు రాలగొడతానని హెచ్చరించారు. తాను, కొడాలి నాని టీడీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చామో తెలిపారు. తొలి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, ఆయన బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే అమరావతి అంటూ రాద్దాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు మాట్లాడితే మమ్మల్ని రాజీనామా చేయాలని అడుగుతున్నారు.. అసలు అమరావతి కావాలా మూడు ప్రాంతాలు కావాలా అని ప్రజలను టీడీపీ నేతలు అడగాలి.. అప్పుడు వారే సమాధానం చెబుతారని రోజా స్పష్టం చేశారు.
ఇక లోకేష్ ఒక పిల్లి పిత్రే.. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసి విజయం సాధించలేక.. అమ్మ, భార్యతో చంద్రబాబును బెదిరించి దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయిన వ్యక్తి. అలాంటి వాడికి సీఎం జగన్ను విమర్శించే అర్హత లేదని రోజా మండి పడ్డారు. లోకేష్ ఒక అడ్రెస్ లేని వెధవ.. అలాంటి వాడు జగన్ని పట్టుకుని వాడు, వీడు అంటే పళ్లు రాలగొడతా అని హెచ్చరించారు. ఈ క్రమంలో తాను, కొడాలి నాని టీడీపీ నుంచి వచ్చిన వారమేనని తెలిపారు. పార్టీ స్థాపించిన ప్రారంబంలో ఎన్టీఆర్ అభిమానిగా తాము టీడీపీలో చేరామని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ నుంచి బయటకు వచ్చామన్నారు. కొడాలి నానిని విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. ఆయన గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరని రోజా తెలిపారు.
ఇక మూడు రాజధానుల బిల్లు పెట్టే దమ్ము మా ప్రభుత్వానికి ఉందా అని టీడీఎల్పీ సమావేశంలో చర్చించారని.. ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకే ఆ ప్రస్తావన చేస్తోందని రోజా స్పష్టం చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు కనుకే.. రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది, సాధిస్తోంది అన్నారు. మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది.. కానీ వాస్తవానికి ఆ పార్టీ నేతలు రాజీనామా చేసి.. అమరావతి రాజధానిగా కావాలా.. మూడు రాజధానులు కావాలా అని ప్రజలను అడిగితే అప్పుడు స్పష్టమైన జవాబు తెలుస్తుంది అన్నారు రోజా. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.