సాధారణంగా మన దగ్గర రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఎక్కడకు వెళ్లినా సరే ఫ్యాన్స్ చూట్టుముడతారు. అందుకే చాలా మంది క్రీడాకారులు, సినిమా వాళ్లు ప్రైవసీ కోసం విదేశాలకు చెక్కేసి.. ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సినిమావాళ్లు, క్రీడాకారులు అంటే నేషనల్ సెలబ్రెటీలు కాబట్టి.. వారికి అభిమానులుండటంలో ఆశ్చర్యం లేదు. కానీ కొన్ని సార్లు.. లోకల్ లీటర్లకు కూడా పొరుగు ప్రాంతాల్లో అభిమానులుంటారు. సదరు నేతలపై వారు చూపించే అభిమానం చూస్తే.. ఆశ్చర్యం కలగకమానదు. తాజాగా ఏపీ ఎంపీ రోజాకు ఇదే అనుభవం ఎదురయ్యింది. ఈ సంఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి పెళ్లికి హాజరవ్వడం కోసం మంత్రి రోజా విశాఖ నుంచి తిరుపతికి విమానంలో బయల్దేరారు. ఈ క్రమంలో ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న రోజాను.. అదే విమానంలో ఎయిర్ హోస్టస్గా పనిచేస్తున్న కలకత్తాకు చెందిన ప్రియాంక పలకరించింది. నేను మీకు పెద్ద ఫ్యాన్ని అంటూ తనను తాను పరిచయం చేసుకుని.. రోజాకు ఓ లెటర్ కూడా ఇచ్చింది.
ఇక రోజాకిచ్చిన లేఖలో ఆమె చేస్తున్న మంచి పనులు, సేవా కార్యక్రమాలు చూసి… తాను అభిమానిగా మారానని ప్రియాంక రాసుకొచ్చింది. రోజా చేస్తున్న మంచి పనులపై ప్రశంసలు కురిపించింది. అంతేకాక రోజాతో సెల్ఫీ కూడా దిగింది. ఈ క్రమంలో ప్రియాంకతో దిగిన ఫోటోను, ఆమె ఇచ్చిన లేఖను తన ఫేస్బుక్లో షేర్ చేసింది రోజా. ‘‘ప్రియాంక చూపిన అభిమానానికి నేను ఎంతో సంతోషించాను. ఇలాంటి అభిమానులుండటం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే’’ అంటూ.. ప్రియాంకతో దిగిన ఫోటో, లెటర్ను తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసింది రోజా. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.