ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలతో థియేటర్ లు సందడి చేస్తుంటే.. వెబ్ సిరీస్ లు, సినిమాలు, రియాలిటీ షోస్ తో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లు సందడి చేస్తున్నాయి. పైగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ బేస్ ని బేస్ చేసుకునే ఇప్పుడు యంగ్ హీరోలంతా డైరెక్ట్ గా ఓటీటీల్లో తమ సినిమాలని, వెబ్ సిరీస్ లని రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సత్యదేవ్ లాంటి యంగ్ హీరోలు ఓటీటీ వేదికగా తమ సత్తా చాటారు. విభిన్నమైన కథలతో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ చేరిపోయారు.
ఉయ్యాలా జంపాలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్.. మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నారు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రంగుల రాట్నం, ఒరేయ్ బుజ్జిగా, అంధగాడు, స్టాండప్ రాహుల్ వంటి సినిమాలతో ఎంటర్టైన్ చేసిన రాజ్ తరుణ్.. ఇప్పుడు ఓటీటీలో కూడా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ఈ యువ హీరో ఇప్పుడు ‘అహ నా పెళ్ళంట’ అనే వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక అయినటువంటి జీ5లో నవంబర్ 17 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రాజ్ తరుణ్ హీరోగా, శివాని రాజశేఖర్ హీరోయిన్ గా హిలేరియస్ ఎంటర్టైనర్ గా.. రాహుల్, సాయిదీప్ ల దర్శకత్వంలో తెరకెక్కింది. 8 ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో పోసాని కృష్ణ మురళీ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో సిరీస్ ఆకట్టుకుంది. మరి రాజ్ తరుణ్ ఈ సిరీస్ తో ఓటీటీలో సాలిడ్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.
Pelli aagipoyindi antadu, pelli get-up lo kanipistadu! Chala confuse chestunnadu kadha mana @itsRajTarun aka Seenu gadu🤦🏻♀️#AhaNaPellanta On November 17@itsRajTarun @Rshivani_1 @tamadamedia @sanjeevflicks @rahultamada @saideepreddy @basava_sri @SheikDawoodG1 @Zee5Tamil pic.twitter.com/cTJefIJIvW
— ZEE5 Telugu (@ZEE5Telugu) November 7, 2022