కొన్ని కొన్ని ఘటనలు వ్యవస్థలోని లోపలకు నిదర్శనంగా ఉంటాయి. ఈ వ్యవస్థలోని లోపల కారణంగా కొందరి జరగాల్సిన న్యాయం జరగటంలేదు. దీంతో వారు న్యాయం కోసం వ్యవస్థపైనే పోరాటనికి దిగుతున్నారు. ఈ పోరాటంలో కొందరు విజయం సాధిస్తున్నారు. మరికొందరు న్యాయం కోసం ఏళ్ల తరబడి యుద్ధం చేస్తూనే ఉంటున్నారు. ఈ యుద్దంలో అలసి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. యుద్దంలో కొందరు చివరకి విజయం సాధిస్తున్నారు. తాజాగా ఓ మహిళ అలాంటి విజయం సాధించింది. భర్త మరణానంతరం తనకు రావాల్సిన పెన్షన్ సొమ్ముకోసం అర్ధ శతాబ్ధంకి పైగా న్యాయపోరాటం చేశారు. ఎట్టకేలకు 89 ఏళ్ల వయస్సులో విజయం సాధించి.. రూ.16 లక్షలు అందుకున్నారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలోన ఆరాద్ బజార్ చెందిన లలిత మొహంతి 37 సంవత్సరాల వయస్సులో తన భర్త భీమ్ సేన్ ను కోల్పోయారు. అయితే చనిపోయే ముందుకు వరకు భీమ్ సేన్ ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేవారు. ఉద్యోగంలో ఉండాగానే భీమ్ సేన్ మరణించారు. భర్త పోయిన బాధలో ఉన్న ఆమెను ఆ సమయంలో ఎవరు ఓదార్చలేకపోయారు. ఆమెకు ఆసరాగా ఉన్న భర్త దూరం కావడంతో ఆమె జీవితం అగమ్యగోచరంగా మారింది. అయితే ఆమెకు ఓఎస్ఆర్టీసీ సంస్థ నుంచి పెన్షన్ వస్తుందని అందరు భావించారు. అయితే లలితాకి సదరు ఆర్టీసీ సంస్థ నుంచి ఎటువంటి పింఛన్ రాలేదు. దీంతో లలిత సుదీర్ఘ కాలం న్యాయపోరాటం చేశారు. అలా ఏళ్లు గడుస్తున్న ఇక తీర్పు రాలేదు.
అలా 52 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా.. తాజాగా లలితకు ఓఎస్ఆర్టీసీ రూ.16 లక్షలు చెల్లించింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యాయం బాగా ఆలస్యం అయిందంటూ, ఈ వ్యవస్థలు మనిషి చనిపోయిన తరువాత న్యాయం చేసేలా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Odisha Woman Receives Pension Money 52 Years After Husband’s Death @OmmcomNews https://t.co/w4RRZb1nDM
— SUSIM C SAHANI (@c_susim) September 23, 2022