ఎవరైన ఆస్తులకు,చదవులకు సంబంధించిన పత్రాలు కనిపించకుండా పోతే… వాటి కోసం పేపర్ ప్రకటన ఇవ్వడం సర్వసాధారణం. ఇంకా బంధువులు కనిపించకుండా పోతే.. కనిపించడం లేదని పేపర్ లో ప్రకటన ఇస్తారు. మరికొందరు తాము పెంచుకుంటున్న మూగజీవాలను తప్పిపోతే న్యూస్ యాడ్ ఇస్తారు. అయితే ఓ ప్రకటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది ఏమిటంటే.. ఓ వ్యక్తి తన మరణ ధృవీకరణ పత్రం పోయిందని పేపర్ ప్రకటన ఇచ్చాడు. ఈ వింత ఘటన అస్సాంలో చోటు చేసుకుంది.
సాధారణంగా డెత్ సర్టిఫికెట్ చనిపోయిన తరువాత ఇస్తారు. దాని కోసం కూడా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సదరు వ్యక్తి కి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే ఈ మధ్యకాలంలో బ్రతికున్నవారికి కూడా డెత్ సర్టిఫికెట్ లో జారీ అవుతున్న ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. అయితే అది అధికారుల తప్పిదాల కారణంగా ఇలాంటివి జరుగుతుంటాయి. తాజాగా అస్సాంకు చెందిన రంజిత్ కుమార్ చక్రవర్తి అనే వ్యక్తి ఈ నెల7న నాగాన్ లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన మరణ ధృవీకరణ పత్రం పోయిందని, ఆ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ 93\18. సీరియల్ నెంబర్ 0068132 తెలుపుతూ ఒక పేపర్ ప్రకటన ఇచ్చాడు. అందులో తన డెత్ సర్టిఫికెట్ నెంబర్ ను కూడా పేర్కొన్నాడు. అయితే ఈ విషయాన్ని తాజాగా ఐపీఎస్ అధికారి రుపిన్ శర్శ తన ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.
“ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి” అంటూ ఆయన షేర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ డెత్ యాడ్ నెటిజన్లను ఓ రెంజ్ లో ఆకర్షిస్తోంది. ఈ ప్రకటన పై నెటిజన్లు ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ డెత్ సర్టిఫికెట్ దొరికేతే ఎక్కడికి పంపాలి? యమలోకానికా లేదా ఇంద్రలోకానికా?, ఇంతకి దొరికితే ఎలా పంపించాలి? అంటూ నెటిజన్లు కామెంట్స చేస్తున్నారు. మరి.. ఈ వింత ప్రకటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It happens only in #India😂😂😂 pic.twitter.com/eJnAtV64aX
— Rupin Sharma (@rupin1992) September 18, 2022