భారత దేశంలో ఉన్న సేవారంగ సంస్థలో అతి ప్రధానమైన వాటిల్లో పోస్టల్ వ్యవస్థ ఒకటి. ఒకప్పుడు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు కేవలం సమాచార మార్పిడి మాత్రమే జరిగేది. అయితే మారుతున్న కాలాన్ని బట్టి తపాల వ్యవస్థలో కూడా అనేక మార్పులు జరిగాయి. నేడు పోస్టాఫీసులు అనేక రకాల స్కీమ్స్ అందిస్తోన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పథకాలు చాలా అందిస్తోంది. బ్యాంకుల వలే అన్ని సేవలను పోస్టాఫీసులు కల్పిస్తోన్నాయి. దీంతో తపాల వ్యవస్థకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. పోస్టాఫీసులు మనీ గ్యారెంటీతో పాటు మంచి రాబటిని అందిస్తాయి. పోస్టాఫీసు లోని ఓ పథకం ద్వారా మీరు ప్రతి సంవత్సరం రూ.1,11,000 పొందుతారు. మరి.. ఆ పథకం ఏంటో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టాఫీసు లో సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకం ఒకటి ప్రధానమైనది. ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడిదారులు భారీ ప్రయోజనాలను పొందవచ్చు. పెట్టుబడిదారులు ఈ ప్రభుత్వ పథకంలో రూ.7.4 శాతం వడ్డీతో ప్రయోజనం పొందుతారు. ఈ వడ్డీతో పాటు వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తోంది. ఈ క్రమంలో వడ్డీ రేట్లలో మార్పు కూడా రావచ్చు. ఈక్రమంలో వడ్డీ రేట్లు మరింత పెరగవచ్చు. ఈ పథకం ద్వారా కనీసం రూ.1000 పెట్టుబడిగా పెట్టాలి. అయితే గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. దీనికి మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సారు. అయితే పెట్టుబడిదారులు ఈ స్కీమ్ ను మరో మూడేళ్లు అదనంగా పొడిగించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-80C కింద మీరు రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే అదే సమయంలో పెట్టుబడిదారుడు పొందే వడ్డీ రూ.50 వేల కంటే ఎక్కువగా ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఒక పెట్టుబడిదారుడు రూ.15 లక్షలు అంటే గరిష్ట మొత్తాన్ని ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే 7.4 శాతం వడ్డీ పొందవచ్చు. దీంతో ప్రతి త్రైమాసికంలో రూ. 27,750 పొందుతాడు. ఈ లెక్కన వార్షిక మొత్తం రూ. 1,11,000 అవుతుంది. ఒక వేళ మీరు ఉమ్మడి ఖాతాను ఓపెన్ చేస్తే గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.30 లక్షలకు పెరుగుతుంది. పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేసిన తర్వాత, వడ్డీ కూడా రూ. 2.2 లక్షలకు రెట్టింపు అవుతుంది. ఇలా ఈ స్కీమ్ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మరి.. పోస్ట్ ఆఫీసులోని ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.