బ్యాంకుల నుంచి రైతులు సులభంగా రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. అయితే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) సులభంగా అందేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్లు కృషి చేస్తున్నాయి. ఈక్రమంలోనే ఈ రెండు బ్యాంకులు రైతులకు శుభవార్త చెప్పాయి. కేవలం కొన్ని గంటల్లోనే కిసాన్ క్రెడిట్ కార్డుల్ని ఇచ్చేందుకు సోమవారం పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఫైలట్ ప్రాజెక్ట పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుల్ని జారీ చేసింది. ఈ బ్యాంకులు ఆన్లైన్లో అప్లయ్ చేస్తే..కొన్ని గంటల్లోనే కిసాన్ క్రెడిట్ కార్డుల్ని జారీ చేయనున్నాయి. రైతులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాక భూమికి సంబంధించిన పత్రాలను కూడా ఆన్లైన్లో అప్లై చేసేందుకు వీలు కల్పించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ ఫైలట్ ప్రాజెక్ట్ ని మధ్యప్రదేశ్ లోని హార్దా జిల్లాలో, ఫెడరల్ బ్యాంక్ చెన్నైలో ప్రారంభించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ లను ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభిస్తుందని, రైతులు బ్యాంక్ కి రావడం, పత్రాలు ఇవ్వడం లాంటి సమస్యల్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా అధిగమించవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆ రెండు బ్యాంకుల రైతులు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్ జారీ అయ్యే సమయం కూడా బాగా తగ్గుతుంది. కేవలం కొన్ని గంటల్లోనే కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్లో అప్లయ్ చేయడానికి కంప్యూటర్ కూడా అవసరం లేదు. కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా అప్లయ్ చేయొచ్చు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం మాత్రమే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చాయి. మిగిన వాటి కోసం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు బ్యాంకులు తీసుకొచ్చిన ఈ కొత్త ఫైలట్ ప్రాజెక్ట్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులు వ్యవసాయ రుణాలు తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఉంటుంది. మరి.. తాజాగా ఈ రెండు బ్యాంకులు తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.