అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా విపక్షాలు, ప్రజలు నిరసన తెలపడం సహజం. కొన్ని సార్లు ఇలాంటి నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తాయి. ఇక నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. దాంతో చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకోవడం సహజం. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాయుతంగా మారింది. ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు దాడి చేశారు. మహిళలను కూడా కర్రలతో కొట్టారు. ఆవేశంతో ఊగిపోయిన నిరసనకారులు ఓ పోలీసు అసిస్టెంట్ కమిషనర్పై తిరిగి ప్రతి దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకిస్తూ.. బీజేపీ మంగళవారం చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు కోల్కతా నగరానికి తరలి వచ్చారు. గతంలో చోటుచేసుకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టకుని.. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అది కాస్త ఉద్రిక్తంగా మారి.. హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. రాజధాని కోల్కతాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన కారులను పోలీసులు కర్రలతో కొట్టగా.. ఓ ప్రాంతంలో పోలీసుపై భౌతిక దాడి జరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు.
Share this also, how peaceful Kolkata was. pic.twitter.com/YbF2rtlO95
— Biswarup Banerjee (@Falguni1951) September 14, 2022
They will Show this 👆👆to Hide these👇👇https://t.co/B5OD60D4U3
— The Cynical देशवासी (@CynicalDeshwasi) September 13, 2022
ఈ క్రమంలో బీజేపీ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు పోలీసు అసిస్టెంట్ కమిషనర్పై దాడి చేసిన వీడియో వైరల్గా మారింది. ర్యాలీని అడ్డుకునేందుకు కోల్కతా పోలీసు అసిస్టెంట్ కమిషనర్ నిరసనకారుల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో చేతిలో బీజేపీ జెండా పట్టుకున్న కొందరు నిరసనకారులు.. సదరు అధికారిని చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు అధికారి పారిపోయేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. నిరసనకారలు ఆయన వెంటే పరిగెత్తి.. దాడికి దిగారు. ఇది గమనించిన స్థానికులు కొందరు సదరు అధికారిని కాపాడారు.
ఇందుకు సంబంధించిన వీడియోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది తెగ వైరలయ్యింది. ఈ వీడియోని టీఎంసీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి.. ‘‘ఈ సంఘటనతో బీజేపీ నిజ స్వరూపం పూర్తిగా బహిర్గతం అయ్యింది. రాఖీ పండుగ రోజున బీజేపీ నేతలు పోలీసులకు రాఖీలు కట్టారు.. ఇక మిగిలిన రోజుల్లో ఇలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల క్షేమం కోసం ఎండనకా.. వాననకా పని చేస్తోన్న ప్రజలపై ఇలా దాడులు జరగడం విచారకరం.. ఇదేనా పోలీసులకు మనమిచ్చే గౌరవం’’ అంటూ టీఎంసీ తీవ్ర స్థాయిలో మండపడింది.
HYPOCRISY OF @BJP4India EXPOSED!
Is this what our police personnel deserve?
They go out of their way for protecting people – come rain or shine! They keep us safe at all times.On Rakhi, @BJP4Bengal leaders tie rakhis to @WBPolice personnel & pose for photos.
On other days 👇 pic.twitter.com/FM1cHMxRa1
— All India Trinamool Congress (@AITCofficial) September 13, 2022
ఇక మరోచోట ఆందోళనకారులు పోలీసు వాహనానికి నిప్పు పెడుతున్న క్లోజ్అప్ వీడియోని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిలో ఓ వ్యక్తి లైటర్తో కారుకు నిప్పంటస్తున్నట్లుగా ఉంది. దీనిపై బీజేపీ మండి పడింది. వీడియోలు ఉన్న వారు బీజేపీ కార్యకర్తలు కారు.. పోలీసులే ఇదంతా చేసి ఉండొచ్చు అని ఖండించింది.
Mamata Banerjee sent TMC cadres to pelt stones at the police so that later BJP could be blamed for it… pic.twitter.com/SkUBecr042
— Amit Malviya (@amitmalviya) September 13, 2022