నీ తలరాతలో అదృష్టం రాసి పెట్టి ఉంటే.. జరగబోయే మంచిని ఏ శక్తి ఆపలేదు. అదే కాలం కలిసి రాకపోతే.. అరటిపండు తిన్నా పళ్లు ఊడిపోతాయి. ఈ మధ్యకాలంలో మన దేశంలో పలువురుని లాటరీ వరించి.. రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులను చేసిన సంఘటనలు అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగు చూసింది. బతుకు తెరువు కోసం ఆ యువకుడు విదేశాలకు వెళ్లాడు. అక్కడ పని చేసే దగ్గర కస్టమర్లు ఇచ్చే టిప్స్తో సరదాగా ఓ సారి లాటరీ టికెట్ కొన్నాడు. ఆ తర్వాత దాని సంగతి మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత స్నేహితులతో కలిసి సరదాగా టూర్కి వెళ్లాడు. అదే రోజు తను కొన్న లాటరీ టికెట్ డ్రా జరుగుతుందని తెలిసి.. లైవ్ చూశాడు.
అయితే ఆశ్చర్యంగా డ్రాలో తాను కొన్న టికెట్కే లాటరీ తగిలింది. ఆ విషయం గురించి ఎవరికైనా చెప్దామా అనుకుంటే తన పోన్ స్విచ్ఛాప్ అయ్యింది. ఈలోపు లాటరీ నిర్వాహకులు కూడా అతడికి కాల్ చేశారు. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే సదరు వ్యక్తి ట్రిప్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యి.. లాటరీ నిర్వాహకులను కలిసి.. విషయం చెప్పాడు. వారు అతడికి.. లాటరీలో గెలిచిన మొత్తం 66 కోట్ల రూపాయలు అందజేశారు. ఆ వివరాలు..
భారత్కు చెందిన కథార్ హుస్సేన్.. షార్జాలోని ఓ కార్ వాష్ కంపెనీలో పని చేస్తున్నాడు. అందుకు గాను.. అతడికి నెలకు 1500 దిర్హామ్స్ అనగా 33,677 రూపాయల జీతం లభిస్తుంది. ఇది కాక కొందరు కస్టమర్లు టిప్స్ ఇస్తారు. ఈ క్రమంలో నవంబర్ 6న కథార్.. తనకు ఆరోజు టిప్స్గా వచ్చిన మొత్తంతో సరదాగా లాటరీ టికెకట్ కొన్నాడు. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో. పైగా ఆరోజు రెండు టికెట్లు కొంటే.. మరొకటి ఫ్రీ అనే ఆఫర్ ఉంది. దాంతో సరదాగా ట్రై చేద్దాం అని కథార్ లాటరీ టికెట్లు కొన్నాడు.
ఇక డిసెంబర్ 3 సాయంత్రం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో కథార్ కొన్న లాటరీ టికెట్లు డ్రా తీశారు. ఆ సమయానికి.. కథార్.. యూఏఈలో పిక్నిక్ ట్రిప్లో ఉన్నాడు. కాకపోతే.. డ్రాను లైవ్లో చూశాడు. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఉంది. అది ఏంటంటే.. కథార్ డబ్బులు పెట్టి కొన్న రెండు టికెట్లకు లాటరీ తగల్లేదు. రెండు కొంటే ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్లో భాగంగా కథార్ ఈ టికెట్లు కొన్నాడని చెప్పుకున్నాం కదా. అలా డబ్బులు పెట్టి కొన్న టికెట్లకు బదులు.. వాటితో లభించిన ఫ్రీ టికెట్కు లాటరీ తగిలింది. డ్రాలో అతడు ఏకంగా 66.50 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు.
ఈ విషయం చెప్పడానికి డ్రా నిర్వాహకులు కథార్కు కాల్ చేశారు. కానీ ఆ సమయానికి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇక డ్రాను లైవ్లో చూసిన కథార్.. లాటరీ తగలిందని తెలుసుకుని సంతోషంతో పొంగిపోయాడు. వెంటనే షార్జాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్లిపోయాడు. తర్వాత డ్రా నిర్వాహాకులను కలిసి.. విషయం చెప్పడంతో వారు.. కథార్ లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని అతడికి అందజేస్తామని తెలిపారు. నెలకు 50 వేల రూపాయలు కూడా సంపాదించలేని తనకు.. ఒకేసారి ఇంత భారీ మొత్తం లాటరీ ద్వారా లభించడంపై కథార్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలోనే తిరిగి ఇండియాకు వస్తానని వెల్లడించాడు.