తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ‘ ఒకటి. దాదాపు పదమూడు సీజన్స్ నుండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఢీ.. ఇప్పుడు ‘డాన్సింగ్ ఐకాన్’ పేరుతో పద్నాలుగో సీజన్ కొనసాగుతోంది. ఈ ఢీ షో ద్వారానే ఎందరో టాలెంట్ ఉన్న డాన్సర్స్ అంతా సినీ ఇండస్ట్రీకి మంచి కొరియోగ్రాఫర్స్ గా రాణిస్తున్నారు. అయితే.. గతంలో ఈ షోకి పార్టిసిపెంట్స్ గా, కొరియోగ్రాఫర్స్ గా వచ్చిన వారే.. కొన్ని సీజన్ల నుండి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చాలా సీజన్ల నుండి షోని యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదివరకంటే ఢీ షో అనగానే సుధీర్ – రష్మీ, హైపర్ ఆది – దీపికా పిల్లి సందడి చేసేవారు. ఇక వారంతా వెళ్లిపోయేసరికి ఈ సీజన్ లో హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇక ఈ వారం షోలో జడ్జిలుగా హీరోయిన్స్ శ్రద్ధాదాస్, పూర్ణ లతో పాటు లేడీ కొరియోగ్రాఫర్ ఆని మాస్టర్ హాజరైంది. అయితే.. ఎప్పటిలాగే ఈ వచ్చేవారానికి సంబంధించి ఢీ కొత్త ప్రోమో విడుదలైంది. ప్రోమోలో ఓల్డ్ సాంగ్స్ ని ఓల్డ్ వేలో ప్రెజెంట్ చేస్తూ చేసిన పెర్ఫార్మన్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే.. డాన్స్ పెర్ఫార్మన్స్ లతో పాటు జడ్జెస్ పై హైపర్ ఆది చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో ఓ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తర్వాత యాంకర్ ప్రదీప్ జడ్జెస్ ని పెర్ఫార్మన్స్ ఎలా ఉందో చెప్పాలని అడిగాడు. ఆ తర్వాత హైపర్ ఆది జోక్యం చేసుకొని.. “ఇది ఢీ షోయేనా లేక కిట్టి పార్టీనా.. మొత్తం ఆడాళ్ళు వచ్చేశారు” అని ఫన్నీ కామెంట్ చేశాడు. అదీగాక ఈరోజు పూర్ణ, శ్రద్ధా, యాని మాస్టర్ లను తెలుగు భాష బ్రతిమాలుకుంటుంది.. నా గురించి ఏమైనా చెప్పండని.. అంటుందని అన్నాడు. ప్రస్తుతం హైపర్ ఆది జడ్జిలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు హైపర్ ఆది అలా అనడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి హైపర్ ఆది కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.