అనసూయ భరద్వాజ ట్విట్టర్ లో ట్వీట్ వేస్తే పాపం.. ఆమె మీద నెటిజన్లు సెటైర్లతో రెచ్చిపోతున్నారు. ఆంటీ అంటూ అదే పనిగా విసిగిస్తున్నారు. తాజాగా ఆమె కేరళలో జరుపుకునే ఓనం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. అయితే దీనికి కూడా నెటిజన్లు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమె ట్వీట్ చేసిన సందర్భం ఏంటో కనీస ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. “కంప్లైంట్స్ విషయం ఎంత వరకూ వచ్చింది” అని ఒక నెటిజన్ అడుగగా.. ‘పోలీస్ డిపార్ట్మెంట్ నీలా మాకు పనీ పాట లేదనుకుంటున్నావా అని చెప్పి పంపించేసారంట’ అంటూ రిప్లై ఇచ్చాడు.
దానికి అనసూయ స్పందిస్తూ.. ‘లేదండి.. మీలా పని పాట లేని వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని చెప్పారండి. మీకు నోరు జారడంలో తొందర ఎలాగో ఉంది. బోల్తా పడడానికి కూడా తొందరే కదా మీకు. కాస్త ఓపిక పెట్టండి. అన్నీ జరుగుతాయి.. జరుగుతున్నాయి’ అంటూ ఆ నెటిజన్ కామెంట్ కి రిప్లై ఇచ్చారు. ఇక మరొక నెటిజన్.. ‘జెన్యూన్ క్వశ్చన్.. ఆంటీ లేదా అంకుల్ అని పిలిస్తే ఏ సెక్షన్ విధిస్తారు?’ అంటూ కామెంట్ చేశాడు.
Ledandi.. meela panipaata leni vaallaki buddhi cheppe time ochindi ani chepparandi.. meeku noru jaaratam lo tondara elago undi..bolta padataaniki kuda tondare kada meeku.. kaasta opika pattandi.. anni jarugutai.. jarugutunnai 😊🙏🏻 https://t.co/y2BlafDd8B
— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 8, 2022
దానికి అనసూయ.. ‘ఆంటీ అని పిలిచినందుకు కాదు, ఆంటీ పేరుతో జరుగుతున్న వేధింపులు.. నా పని తీరును, నా మానసిక ప్రశాంతతను హర్ట్ చేసేందుకు జరుగుతున్న కుట్రపై కేసు పెట్టాను. ఇది శిక్షార్హమైన నేరం’ అంటూ ట్వీట్ చేశారు. అనసూయని ఆంటీ అని పిలవడం తప్పు కాదు, కానీ ఆంటీ పేరుతో ఆమెని వెటకారం చేయడం, తప్పుడు ఉద్దేశంతో చూడడం తప్పని ఆమె అంటున్నారు. మరి అనసూయ చేసిన ఈ ట్వీట్స్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
It isn’t for calling aunty.. its about the bully that is happening in the name of it.. its the conspiracy revolving around to hurt my line of work and my mental peace.. it is a punishable offence 🙏🏻
— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 8, 2022