టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈ మధ్య ఎప్పుడు పడితే అప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. అది కూడా సినిమాల పరంగా కాదు. రీసెంట్ గా ఆమె ఆరోగ్యం బాగోలేదని న్యూస్ వచ్చింది. కానీ అది నిజం కాదని సమంత మేనేజర్ క్లారిటీ ఇవ్వడంతో అంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సామ్ చర్చనీయాంశమయ్యారు. ఈ క్రమంలోనే పూజలు చేస్తూ కనిపించిన సమంత.. అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. కారణం అదేనేమో అని వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ లోని వేదపాఠశాలలో సమంత కనిపించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు సామ్ దూరంగా ఉండటంతో.. అసలు ఏం జరిగిందా అని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే తమ భవిష్యత్తు ప్రాజెక్టుల మంచి ఫలితాలు అందుకోవాలనే ఈ పూజలు చేసినట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో సమంత లుక్ డిఫరెంట్ గా ఉంది. 'శాకుంతలం' మూవీ కంప్లీట్ చేసిన సమంత.. 'యశోద', 'ఖుషీ' సినిమాల్లో నటిస్తోంది. 'యశోద' టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో గర్భవతి పాత్రలో నటించింది. సామ్ యాక్టింగ్ అంచనాల్ని పెంచేస్తోంది. ఈ మూడింటితో పాటే హిందీలోనూ సమంత పలు ప్రాజెక్టులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కెరీర్, సినిమాలని దృష్టిలో పెట్టుకునే ఈ పూజలు చేసినట్లు సమాచారం. సమంత ప్రత్యేక పూజల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇదీ చదవండి: చై- సామ్ విడిపోవడంపై సమంత తండ్రి ఎమోషనల్ పోస్టు..!