సినిమా సెలబ్రిటీలు అంటే కొన్ని విషయాలు ఆచితూచి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఎక్కడ తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని భయపడుతుంటారు. కానీ ఆర్జీవీ, కంగనా రనౌత్ లాంటి వాళ్లు.. మిగతా వాళ్లతో పోలిస్తే డిఫరెంట్. ఎవరేమనుకున్నా పట్టించుకోరు. తాము అనుకున్నదే చేస్తుంటారు. అలా అప్పుడప్పుడు వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. అలానే ఇప్పుడు కంగన.. మహాత్మా గాంధీజీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భామ కంగనా రనౌత్. మొదట్లో గ్లామరస్ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. జాతిపిత మహాత్మాగాంధీ గురించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. దిల్లీలోని 'రాజ్ పథ్' పేరును 'రాజ్ పథ్ కర్తవ్యపథ్' పునరుద్ధరించారు. ఈ ఈవెంట్ కి హాజరైన కంగన ఈ వ్యాఖ్యలు చేసింది. 'నేను గాంధీవాది కాదు నేతాజీవాదిని. నేను మాట్లాడితే చాలామంది ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరికీ సొంత ఆలోచనా విధానం ఉంటుంది. ఈ కారణంగా నేతాజీ, సావర్కర్ లాంటి చాలామంది విప్లవకారులు చేసిన పోరాటానికి సరైన గుర్తింపు రాలేదని అనుకుంటున్నాను. గాంధీ నిరాహారదీక్ష, దండి కవాతు చేయడం వల్ల స్వాతంత్య్రం వచ్చిందని అందరూ చెబుతారు. లక్షలాది మంది ప్రజలు ప్రాణత్యాగం చేశారు. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొనడం ద్వారా మన దేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలని నేతాజీ ప్రచారం చేశారు. దానికోసం ఆయన సైన్యాన్నిరెడీ చేశారు. అందువల్ల బ్రిటీష్ వారిపై ఒత్తిడి పెరిగింది. దానివల్లే దేశానికి స్వాతంత్య్రం సాధించగలిగారు' అని కంగన తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. ఇదీ చదవండి: కంగనా రూటే సెపరేటు.. అవార్డ్ ఇస్తామంటే.. కేసు పెట్టింది! ఇదీ చదవండి: ఆరోజు అమీర్ ఖాన్ చేసిన తప్పు.. వీడియో షేర్ చేసి పరువు తీసిన కంగనా!