మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరు అంటేనే ఒక పండగ. అలాంటి మెగాస్టార్ దసరా బరిలో దిగితే.. డబుల్ బొనాంజానే. దసరా సందర్భంగా గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ అయ్యింది. సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటించారు. రీమేక్ రాజాగా పేరొందిన మోహన్ రాజా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. లూసిఫర్ రీమేక్ అన్న పేరుకే కానీ దాన్ని మరిపించేలా ఈ గాడ్ ఫాదర్ ని తెరకెక్కించడంతో.. ఈ సినిమా మొదటి ఆట నుంచి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. రిలీజైన ప్రతీ చోటా కాసుల సునామీ సృష్టిస్తోంది. అసలే మన తెలుగు హీరోలు రీమేక్స్ లో నటిస్తే ఇరగ్గొట్టేస్తారు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి అంటే మామూలుగా ఉండదు.
రిలీజ్ కు ముందు టీజర్, ట్రైలర్ భారీ అంచనాలు పెంచేయడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. థియేట్రికల్ హక్కుల్లో నైజాం 22 కోట్లు, సీడెడ్ లో 13.5 కోట్లు, ఆంధ్రాలో 35 కోట్లు, కర్ణాటక 6.5 కోట్లు, ఇతర రాష్ట్రాల హక్కులు 6.5 కోట్లు, ఓవర్సీస్ 7.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికొస్తే.. నైజాం 3.40 కోట్లు, సీడెడ్ 3.18 కోట్లు, గుంటూరు 1.75 కోట్లు, కృష్ణా 72.76 లక్షలు, తూర్పు గోదావారి 1.60 కోట్లు, పశ్చిమగోదావరి 84.18 లక్షలు, నెల్లూరు 60 లక్షలు, కర్ణాటక 1.8 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 1.2 కోట్లు, యూఎస్ఏ 1.60 కోట్లు వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణ టోటల్ షేర్ 13.37 కోట్లు ఉండగా, వరల్డ్ వైడ్ షేర్ వచ్చేసి 18 కోట్లు ఉంది.
HUMONGOUS BLOCKBUSTER #GodFather off to a sensational start 💥
Worldwide gross of 38 CR+ on DAY 1 🔥Book your tickets now! 🔥
–https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfather 🔥@KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev @ProducerNVP pic.twitter.com/oEgdbINa2d— Konidela Pro Company (@KonidelaPro) October 6, 2022
వరల్డ్ వైడ్ గ్రాస్ 38 కోట్లు పైగా కలెక్ట్ చేసినట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. రిలీజ్ కి ముందు ఓవర్సీస్ కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 38 నుంచి 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. మొదటి రోజు ఈ సినిమా 38 కోట్ల గ్రాస్ షేర్ ని రాబట్టింది. ఇదిలా ఉంటే మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 తొలి రోజున 23.25 కోట్లు, సైరా నరసింహారెడ్డి 38.75 కోట్లు, ఆచార్య 29.5 కోట్లు వసూలు చేశాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తుంది. దసరా పండగ కావడం, వీకెండ్ కూడా తోడవ్వడంతో తొలి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనబడుతోంది.