ఎలాంటి శుభకార్య తలపెట్టినా.. ఏ పూజ చేసినా.. అది ఎలాంటి విఘ్నాలు లేకుండా.. అవరోధాలు లేకుండా సాగాలని ముందుగా వినాయకుడికే పూజ చేస్తారు. ఆ తర్వాతే అసలు పూజ చేస్తారు. గణాలకు అధిపతి, విఘ్నాలను దరి చేరకుండా చూసే స్వామి, లంబోదరడు, మూషికవాహనుడు ఇలా ఈ పేరుతో పిలిచినా పలికే స్వామి పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి పర్వదినం చేసుకుంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిలో జన్మించాడు వినాయకుడు. ఆయన పుట్టిన రోజు నాడు నుంచి నవరాత్రుల పాటు ఉత్సవాలు జరుపుతారు.
ఇక ఊరువాడా ఎక్కడ చూసినా గణేష్ మండపాలు దర్శనమిస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 31న వినాయక చవితి వస్తుంది. ఈ క్రమంలో పండుగను ఎలా జరుపుకోవాలి, పండుగ రోజున ఏం చేయాలి.. వినాయకుడిని ఎలా పూజించాలి.. పూజలో ఏయే పదార్థాలు సమర్పించాలి.. నిమజ్జనం ఎప్పుడు చేయాలి.. ఎలాంటి ప్రసాదాలు సమర్పించాలి వంటి తదితర వివరాలను రమా రావి గారు సుమన్టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.