హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. వినాయకచవితి సందర్భంగా ప్రతీ ఏటా భారీ ఎత్తున మహా గణపతిని నిలబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన ఎత్తైన విగ్రహాలను తయారుచేసి ప్రతిష్టిస్తుంటారు. అయితే ఈసారి చేయబోయే వినాయకుని విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. పర్యావరణానికి హాని కలిగించకుండా, పర్యావరణహితమైన మట్టితో గణపతిని చేస్తున్నారు. శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని మట్టితో చేయడం, అది కూడా 50 అడుగుల ఎత్తులో చేస్తున్నారు. 68 ఏళ్ళలో ఏరోజూ మట్టితో చేయలేదు. ఇప్పుడు మట్టితో ఎత్తైన గణపతిని చేస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మట్టి గణపతిని చేయడానికి కోటి రూపాయలకు పైనే ఖర్చయ్యింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసినప్పుడు కేవలం ఒక వంతు స్టీల్ వాడేవారు. కానీ మట్టితో చేస్తున్నారు కాబట్టి చెక్కు చెదరకుండా ఉండడం కోసం, వర్షానికి తట్టుకుని నిలబడేలా ఉండడం కోసం మూడు వంతుల స్టీల్ని వినియోగిచారు. దాదాపు 25 టన్నుల స్టీల్ని, వరిపొట్టు, జనపనార, వరిగడ్డి, మట్టి, సన్నఇసుక వంటివి వినియోగించి ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఆగస్ట్ 31న వినాయకచవితి సందర్భంగా ఈ శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి మనకి దర్శనమిస్తారు. మరి 50 అడుగుల ఎత్తుతో మట్టితో తయారుచేయబడిన ఖైరతాబాద్ గణపతి గురించి పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో క్లిక్ చేయండి. అలానే ఈ వీడియోపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.