నేటికాలంలో కొంతమంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం కొరవడింది. ప్రతి చిన్న సమస్యకి ఎంతో భయపడిపోతున్నారు. వాటిని ఎలా అధికమించాలి అనే ఆలోచన చేయరు. ఇక జీవితంలో ముందుకు వెళ్లలేమంటూ తమలో తామే నిరుత్సాహంలో కూరుకపోతుంటారు. మరికొందరు అయితే కనీసం తమ బాధలను కుటుంబ సభ్యులతో సైతం పంచుకోకుండా వారిలో వారే కుమిలిపోతుంటారు. ఈ క్రమంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువతి.. తన తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏదో సాధించింది అనుకుంది. కానీ.. అప్పటికి కొడుకు మరణంతో తీవ్ర వేదనలో ఉన్న వారికి..సదరు యువతి తీసుకున్న నిర్ణయం మరింత కుంగిపోయేలా చేసింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. స్థానికల కథనం మేరకు..
ఒడిశా రాష్ట్రం జయపురం పట్టణం సమీపంలో పారాబెడలో గదాధర నాయిక్ అనే వ్యక్తి కుటుంబతో కలిసి జీవిస్తున్నాడు. ఆయనకు శిభాశిస్ నాయిక్ అనే 12 ఏళ్ల కుమారుడు, రశ్మితా నాయిక్ అనే 24 ఏళ్ల కూతురు ఉన్నారు. ఇద్దరిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. వారిద్దర్ని బాగా చదవించి.. ఉన్నత స్థాయిలో ఉంటే చూడాలని ఎన్నో కలలు కన్నాడు. అందుకు తగ్గటే తాను కష్టపడి పనిచేస్తూ పిల్లలిద్దర్ని చదివిస్తున్నాడు. అలానే తమ్ముడు అంటే ఆ అక్కకు ఎక్కడ లేని ప్రేమ. ఇలా సాగుతున్న వీరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ గదాధర నాయిక్ కుమారుడు శిభాశిస్ నాయిక్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. ‘మా బిడ్డ ఇకరాడే’.. అంటూ తీవ్ర వేదనకు లోనయ్యారు. అయితే ఈ క్రమంలో వారి మరో విషాదం చోటుచేసుకుంది.
కుమారుడు మరణించి రెండు రోజులు గడవక ముందే కూతరు రశ్మితా నాయిక్(24) శనివారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ ఇంట్లో వరుసగా రెండు ఆత్మహత్యలు జరగడంతో కటుంబమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అసలు తమ బిడ్డలకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియక ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. అయితే తమ్ముడి మరణాన్ని జీర్ణంచుకోలేకే రశ్మితా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.