నేటికాలంలో సమాజం ఎటువైపు వెళ్తుందో అర్ధంకాని పరిస్థితి. మానవత్వం మంటగలిసిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు రక్షణ అనేది కరవు అవుతుంది. ఒంటరికిగా బయటకి వెళ్తే.. మానవ రూపంలో ఉన్న ఏ మృగం దాడి చేస్తుందో తెలియదు. ఇంకా దారుణం ఏమిటంటే అాలాంటి మానవ మృగాల నుంచి రక్షించాల్సిన కన్నవారే ఆడబిడ్డలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ కసాయి కన్నతండ్రే.. కూతురిపై అత్యాచారం చేశాడు. కామాధుడిగా మారిన భర్త నుంచి బిడ్డను కాపాడాల్సిన తల్లే.. అతడికి సహకరించింది. సదరు బాలిక చిన్నాన్న, నాన్నమ్మను ఆశ్రయించడంతో ఈ ఘోరం బయటపడింది. ఆ కసాయి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకి హాజరు పరిచారు. ఈ కేసుపై నాలుగేళ్లు విచారణ జరిగిన తరువాత కోర్టు సంచనల తీర్పు ఇచ్చింది. మరి.. ఈ ఘటన ఏక్కడ జరిగింది? కోర్టు ఇచ్చిన ఆ సంచలన తీర్పు ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలానికి చెందిన కృష్ణమూర్తి, ధనమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఒక బిడ్డే కావడంతో ఏ లోటు లేకుండా పెంచుకున్నారు. కొన్నాళ్లకి కృష్ణమూర్తి మద్యానికి బానిసగా మారి.. రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఇదే సమయంలో మరికొన్ని చెడు పనులు చేసేవాడు. ఈక్రమంలో తన రక్తం పంచుకుని పుట్టిన పదేళ్ల కూతురిపై కృష్ణమూర్తి కన్నేశాడు. ఎలాగైనా కూతురిపై తన కోరికను తీర్చుకోవాలని భావించాడు ఈ దుర్మార్గుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెను భయపెట్టి లైంగికంగా దాడి చేశాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెప్తే.. చంపేస్తానంటూ బెదిరించాడు.
కాపాడాల్సిన కన్నతండ్రే తనపై కామంతో దాడి చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయపడుతూ అలానే ఉండిపోయింది. ఇంటికి వచ్చిన తన తల్లికి తండ్రి చేసిన దారుణం గురించి తెలిపింది. కన్న కుమార్తెపై లైంగిక దాడి చేసిన భర్తను.. మందలించాల్సిన తల్లే.. భర్తకు సహకరించింది. అలా మూడేళ్ళు పాటు కుమార్తెపై భర్త కామ కోరికలు తీర్చుకునేందుకు భార్య సహకరించింది. కన్నవారే తనపై క్రూరంగా ప్రవర్తించడంతో తట్డుకోలేని ఆ బాలిక ఇంట్లో ఎవరులేని సమయం చూసి చిన్నాన్న, నానమ్మకు విషయాన్ని భోరున ఏడ్చేసింది. బాలికతో కలిసి వారిద్దరు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కృష్ణమూర్తి, ధనమ్మల అరెస్ట్ చేశారు. కన్నతండ్రి బాలికపై మూడేళ్లుగా లైంగిక దాడికి చేసినట్లు బలమైన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
అయినప్పటికి ఈ కేసుపై నాలుగు సంవత్సరాల పాటు కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. చివరికి నేరం రుజువు కావడంతో నిందితులైన కృష్ణమూర్తి, ధనమ్మలకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాక వెయ్యి రూపాయలు జరిమాన విధించింది. అంతే కాకుండా బాలికకు మూడు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పును వెల్లువరించింది. ఈ తీర్పుపై కొందరు సంతోషం వ్యక్తం చేశారు. “న్యాయం ఇంత ఆలస్యంగా జరిగితే.. ఇలాంటి ఘోరాలు మరెన్నో జరుగుతాయి” అంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేశారు.