దేశంలోనే అతి పెద్ద ఆభరణాల సంస్థగా నిలిచిన జోయ్ అలుక్కాస్కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. వరుసగా ఐదు రోజుల పాటు జోయ్ అలుక్కాస్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. భారీ మొత్తంలో ఆస్తులు జప్తు చేశారు. ఆ వివరాలు..
దేశంలోనే రెండో అతిపెద్ద ఆభరణాల సంస్థగా కొనసాగుతోంది కేరళకు చెందిన ప్రముఖ జ్యూయెలరీ గ్రూప్ జోయ్ అలుక్కాస్. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 68 బ్రాంచ్లున్నాయి. జ్యూయెలరీ బిజినెస్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన జోయ్ అలుక్కాస్కు భారీ షాక్ తగిలింది. జోయ్ అలుక్కాస్ జ్యూయెలరీ సంస్థలపై దేశ వ్యాప్తంగా ఈడీ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. జోయ్ అలుక్కాస్ షోరూముల్లో.. వరుసగా ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఈసోదాల్లో సుమారు.. 305.84 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది.
జోయ్ అలుక్కాస్ సంస్థ.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఈ సందర్భంగా ఈడీ ఆరోపించింది. ఇక జోయ్ అలుక్కాస్ సంస్థ నుంచి అటాచ్ చేసిన ఆస్తులలో 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్తులు ఉన్నాయి. 91.22 లక్షల విలువైన మూడు బ్యాంకు ఖాతాలు, 5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్డ్ డిపాజిట్లు, 217.81 కోట్ల విలువైన జోయ్ అలుక్కాస్ షేర్లను కూడా ఈడీ సీజ్ చేసింది.
జోయ్ అలుక్కాస్ సంస్థ.. హవాలా మార్గాల ద్వారా భారతదేశం నుంచి దుబాయ్కి భారీ మొత్తంలో నగదును బదిలీ చేసింది. ఆ తర్వాత 100 శాతం జోయ్ అలుక్కాస్ వర్గీస్కు చెందిన జోయల్లుకాస్ జ్యువెలరీ LLC, దుబాయ్లో పెట్టుబడి పెట్టింది. 2,300 కోట్ల ఐపీవో ఉపసంహరించుకున్న మరునాడే వరుస సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు వెల్లడించారు. అంతేకాక ఈ సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులను సీజ్ చేశారు. జోయ్ అలుక్కాస్.. 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్టు కోసం దుబాయ్కి హవాలా రూపంలో 305 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ అధినేత నివాసాలు, కార్పొరేట్ ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో సేకరించిన ఆధారాలు అధికారిక పత్రాలు, మెయిల్లు, హవాలా లావాదేవీలలో జాయ్ అలుక్కాస్ ప్రమేయం ఉన్నట్లు ‘స్పష్టంగా రుజువు చేయబడింది’ అని ఈడీ అధికారులు తెలిపారు.
గత ఏడాది ఐపీవోకి వెళ్తున్నట్లు ప్రకటించిన జోయ్ అలుక్కాస్.. దీని ద్వారా రూ. 2,300 కోట్లను సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని ప్రచారం జరిగింది. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు ఐపీఓను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.. ఆ మరుసటి రోజు నుంచే ఈడీ సోదాలు నిర్వహించడం గమనార్హం. ఇక ఐదు రోజుల పాటు సాగిన సోదాల్లో సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను జప్తు చేసింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.