ప్రపంచకుబేరుడి రేసులో గౌతమ్ అదానీ దూసుకుపోతున్నారు. గత నెలలో బిల్ గేట్స్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నాల్గవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఫ్రాన్స్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ను సైతం వెనక్కి నెట్టి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముకేశ్ అంబానీకి సైతం సాధ్యం కాని ఈ ఫీట్ను అదానీ సాధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముకేశ్ను అధిగమించిన అదానీ.. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో టాప్-3లో అడుగుపెట్టిన తొలి ఆసియా వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రెగ్యులర్గా ప్రపంచ కుబేరుల జాబితాను ప్రకటిస్తుంటుంది.
ప్రతీ బిలియనీర్ యొక్క ప్రొఫైల్ పేజ్లో నికర విలువ విశ్లేషణకు సంబంధించి గణాంకాల ప్రకారం సంపన్నుల జాబితా డిసైడ్ చేస్తుంది. ఈ గణాంకాలన్నీ న్యూయార్క్లో ప్రతీ రోజూ ట్రేడింగ్ ముగిసే సమయానికి అప్డేట్ అవుతుంటాయి. ఇందులో భాగంగానే ఈ నెలలో ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 137.4 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ.. ఫ్రాన్స్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ను వెనక్కి నెట్టారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ 251 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో ఉండగా.. జెఫ్ బెజోస్ 153 బిలియన్ డాలర్ల సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత భారత్ నుంచి అదానీ ఉండడం గర్వించే విషయం.
కాలేజ్ డ్రాపౌట్ అయిన గౌతమ్ అదానీ.. డైమండ్ ట్రేడర్గా కెరీర్ మొదలుపెట్టి ఇవాళ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. అదానీ ఎటువంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి వ్యక్తి. అదానీ కుటుంబంలో ఆయనే మొదటి తరం వ్యక్తి. ఎనర్జీ, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, మైనింగ్, గ్యాస్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎయిర్పోర్ట్స్ వంటి వ్యాపారాలతో దేశంలోనే టాప్లో ఉన్నారు అదానీ. అడుగు పెట్టిన ప్రతీ బిజినెస్లోనూ అదానీ సత్తా చాటుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ తర్వాత అదానీ గ్రూప్ మూడవ అతి పెద్ద కంపెనీల సమ్మేళనం కలిగిన గ్రూప్గా ఎదిగింది.
అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ వంటి కంపెనీలు అదానీ గ్రూప్లో ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా అదానీ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఎయిర్పోర్ట్స్, సిమెంట్, కాపర్ రీఫైనింగ్, డేటా సెంటర్స్, గ్రీన్ హైడ్రోజన్, పెట్రో కెమికల్ రీఫైనింగ్, రోడ్స్, సోలార్ సెల్ మేనుఫ్యాక్చరింగ్ వంటి ఎదుగుతున్న రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు అదానీ. ఇప్పుడు టెలికాం రంగంలోకి ప్రవేశించాలని, గ్రీన్ హైడ్రోజన్, ఎయిర్పోర్ట్స్ వ్యాపారాలని పెంచడానికి భారీ ప్రణాలికలను వేస్తున్నారు. రీసెంట్గా అదానీ గ్రూప్.. ఒడిషాలో రూ.580 బిలియన్లకు ఖర్చుతో 4.1 ఎమ్టిపిఏ ఇంటిగ్రేటెడ్ అల్యూమినా రీఫైనరీ ప్లాంట్, 30 ఎమ్టిపిఏ ఐరన్ ఓర్ ప్లాంట్లను పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ మధ్య ఆస్ట్రేలియాలోని కార్మికైల్ బొగ్గు గనుల తవ్వకం హక్కులను అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే పర్యావరణవేత్తల నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తడంతో గ్రీన్ ఎనర్జీలోకి అడుగుపెట్టింది. గ్రీన్ ఎనర్జీలో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు అదానీ గ్రూప్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. కార్పొరేట్ సామాజిక బాధ్యతతో సమాజానికి తమ వంతు కాంట్రిబ్యూట్ చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ వంటివి చేయడానికి 60 వేల కోట్లు ఖర్చు పెట్టాలని షేర్ హోల్డర్స్తో జూలై నెలలో జరిగిన వార్షిక జనరల్ మీటింగ్లో అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఆ రకంగా అదానీ బిజినెస్మేన్గానే కాకుండా కామన్మేన్గా కూడా ఆలోచించి మానవత్వంలో కూడా ముందు వరుసలో ఉంటున్నారు. ఇక 91.9 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. మరి 60 ఏళ్ళ అదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ 3లో ఉండడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Gautam Adani has overtaken France’s Bernard Arnault to become the world’s third richest person, according to the Bloomberg Billionaires Index.https://t.co/xwvI23GZGz
— Mint (@livemint) August 30, 2022