కేంద్రం తీసుకువచ్చే నూతన విధానం ద్వారా గ్యాస్ ధరలు తగ్గుతాయని కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నూతన విధి విధానాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గించాయి. ఆ వివరాలు..
ఒక్క రిపోర్టుతో అదానీ గ్రూప్ను కుదేలు చేసిన హిండెన్బర్గ్.. మరో బాంబును పేల్చేందుకు రెడీ అవుతోంది. ఈసారి ఎవర్ని టార్గెట్ చేయనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హిండెన్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో లక్షల కోట్ల సంపదను నష్టపోయినా, ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. వేల కోట్ల రుణాలను గడువుకు ముందే చెల్లిస్తూ.. ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం నింపుతున్నారు. తాజగా, రూ. 21వేల కోట్లకుపైగా అప్పులను రెండు వారాల ముందే చెల్లించి వార్తల్లో నిలిచారు.
'అదానీగ్రూప్ vs వివాదాలు' ఈ వ్యవహారం ఇప్పటిలో సద్దుమనిగేలా కనిపించటం లేదు. ఒకటి పోతే మరొకటి అదానీ గ్రూప్ మెడకు ఉచ్చు బిగిస్తున్నాయి. ఇప్పటికే.. అమెరికన్ రీసర్చ్ సంస్థ ''హిండెన్బర్గ్' వెల్లడించిన నివేదికల ధాటికి లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయాన వికీపీడియా ఆరోపణలు మరోసారి తలనొప్పిగా మారాయి. వికీపీడియాను అదానీ గ్రూప్ తమకు అనుకూలంగా మార్చుకుందన్నది ప్రధాన ఆరోపణ.
ప్రస్తుతం అదానీ గ్రూప్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అదానీపై స్టాక్ మ్యానిప్యులేషన్ ఆరోపణలు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాతాళానికి పడిపోయాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అదానీకి సహాయం చేసేందుకు ఓ ప్రభుత్వ బ్యాంకు ముందుకొచ్చింది. అదానీ పరిస్థితి తెలిసే లోన్ ఇస్తామని ప్రకటించింది.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ తో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ ను విపరీతంగా ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు ఈ వివాదం కళారంగాన్ని సైతం ప్రభావితం చేసింది. ఓ అవార్డు స్పాన్సర్ అదానీ అని తెలిసి ఒక కవయిత్రి ఆ అవార్డు నాకొద్దు అంటూ తిరస్కరించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీలో ఎంట్రీ ఇచ్చిన అదానీ గ్రూప్.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా అడుగులేసింది. తాజాగా ఏపీ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనం.
అదానీ గ్రూపు.. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీని గురించే చర్చ. అమెరికాకు చెందిన ఓ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ అదానీ గ్రూపుపై ఓ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఆ నివేదిక కారణంగా అదానీ గ్రూపు షేర్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇది పెద్ద కుంభకోణమని దీనిపై దర్యాప్తు జరగాలంటూ విపక్షాలు పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై బీజీపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి […]
హిండెన్బర్గ్ నివేదికతో గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లోనే అదానీ సంపద దాదాపు సగం ఆవిరయ్యింది. ఈ నేపథ్యంలో అదానీ సంస్థలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితి ఏంటా అన్ని విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు బ్యాంకులకు కూడా ఇదే తీరు.. ఇచ్చిన రుణాలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి. కానీ ఓ ప్రభుత్వ బ్యాంక్ అందుకు విభిన్నంగా స్పందిచింది. అదానీ సామ్రాజ్యం […]
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అత్యంత ప్రతికూలంగా మారింది. హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ అతలాకుతలమవుతోంది. ఈ నివేదికతో అదానీ గ్రూప్ సంస్థలకు స్టాక్ మార్కెట్లలో చుక్కెదురైంది. ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో ఆ గ్రూప్కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇన్వెస్టర్లలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు గౌతమ్ అదానీ పలు చర్యలకు ఉపక్రమించారని బ్లూమ్బర్గ్ […]