ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు.. ఉచితంగా నిత్యావసర సరకులు అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులను ప్రవేశ పెట్టింది. అందుదలో భాగంగానే ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. అయితే రోజులు గడుస్తోన్న కొద్ది ఈ రేషన్ కార్డుల విషయంలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. ఈ అవకతవకల వల్ల అర్హులు నష్టపోయి.. అనర్హులు లాభపడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో లోపాలను సరిదిద్ది కేవలం అర్హులే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా కోన్ని నిబంధనలు తీసుకోచ్చింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు ఒక విజ్ఞప్తి చేసింది. అదేంటంటే? మీలో ఎవరైన రేషన్ కార్డుకు అనర్హులు అని తెలిస్తే మీ అంతట మీరే.. ఆ రేషన్ కార్డును అధికారులకు సరెండర్ చేయాలని తెలిపింది. అదీకాక అనర్హమైన కార్డులను రద్దు చేసేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది. దేశవ్యాప్తంగా రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న క్రమంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అర్హులు అయిన పేదలు నష్టపోతున్నారని.. కేంద్రం రేషన్ కార్డు విషయంలో ఈ నిబంధనలను తెచ్చింది. మీ డబ్బుతో.. 100 చ.మీ ప్లాట్ లేదా ఇల్లు కట్టుకుని ఉన్నాగానీ.. మీకు ఫోర్ వీలర్ వెహికల్ లేదా ట్రాక్టర్ వంటి వాహనం కలిగి ఉండి, మీ ఆదాయం ఊర్లో రూ. 2 లక్షలు కంటే ఎక్కువ సంపాదిస్తుంటే( నగరంలో అయితే రూ.3 లక్షలు కంటే ఎక్కువ ఉంటే), అలాగే ఆయుధాల లైసెన్స్ కలిగి ఉన్నాగానీ వారి రేషన్ కార్డు రద్దు అవుతుంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న వారు.. వారంతంట వారే తమ రేషన్ కార్డును దగ్గర్లో ఉన్న సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో సబ్ మిట్ చేయవలసిందిగా కేంద్రం పేర్కొంది. అలా చేయని పక్షంలో తమ ఇన్వెస్టిగేషన్ లో అనర్హులు అని తేలితే.. చట్టరీత్య శిక్షకు గురిఅవుతారని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు ఉచితంగా నెలకు 5 కిలోల బియ్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పథకాన్ని మరికొన్ని నెలలు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.