గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు అందరూ చదువుకునే ఉంటారు. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలతో సమానం. మనకు జ్ఞానాన్ని బోధించే ప్రత్యక్ష దైవం అని అర్థం. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉంటూ ఎంతోమంది ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఆ జాబితాలోకి మరో టీచరమ్మ చేరింది. పాఠాలు చెప్పమంటే పిల్లలకు పట్లు నేర్పుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయి ప్రైమరీ పాఠశాలలో ఊర్మిళా సింగ్ టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె పిల్లలకు పాఠాలు చెప్పమంటే వారితో మసాజ్ చేయించుకుంటోంది. ఓ పిల్లాడు ఆమె చేతికి మసాజ్ చేస్తున్న వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఓ కుర్రాడు ఆమె చేయి నొక్కుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేయడమే కాకుండా.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ టీచరమ్మ తరగతులకు వెళ్లదని.. పాఠాలు కూడా సరిగ్గా చెప్పదంటూ స్కూల్ హెడ్ మాస్టర్ తెలియజేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Teacher having bicep Massage by students, Viral video from Hardoi UP govt school. pic.twitter.com/MF8lEQPvEZ
— Grading News (@GradingNews) July 27, 2022