బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫుల్ జోష్ తో కొనసాగుతోంది. ఇప్పటికే 6 వారాలు పూర్తయ్యాయి. ఇంట్లోని సభ్యులు ఎలిమినేట్ అవుతున్న కొద్దీ హౌస్ లో వాతావరణం వేడెక్కుతోంది. ఇంక ప్రతివారంలాగానే ఈ వారం కూడా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నిర్వహిస్తున్నారు. ‘ఇది మా అడ్డా’ అనే టాస్కులో బిగ్ బాస్ బిగ్ షాకిచ్చాడు. ఇంట్లో ఎవరికైతే పడదో వాళ్లనే ఒక టీమ్ గా ఏర్పాటు చేశారు. శివ- నటరాజ్, బిందు మాధవి– అఖిల్, అరియానా– అజయ్, మిత్రా శర్మ- మహేశ్, హమీదా- అనీల్ గ్రూపులుగా ఏర్పడ్డారు. కెప్టెన్ అషూరెడ్డి సంచాలకురాలిగా వ్యవహిస్తోంది.
ఇదీ చదవండి: కోలీవుడ్ హీరోతో బిందు మాధవి ప్రేమాయణం! ట్వీట్ వైరల్
ఈ గేమ్ లో ఎవరు సొంతం చేసుకున్న ప్రాంతాలను వారు కాపాడుకోవాల్సి వస్తుంది. పోటీ చివరి వరకు వారి ప్రాంతాలపై వారికి ఆధిపత్యం ఉండాలి. వేరే టీమ్ సభ్యులు వారి ప్రాంతాన్ని వినియోగించుకునేందుకు వీలు లేకుండా కట్టడి చేయాల్సి వస్తుంది. ఈ గేమ్ లో పాస్ లు కూడా ఉన్నాయి. ఎవరి టీమ్ పాస్లను వాళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ, అరియానా గేమ్ మొదలు కాకుండా తన పాస్ లు పోగొట్టుకుంది. ఇక్కడ బిందు- అఖిల్ అయితే చిన్ననాటి దోస్తుల్లా కలిసిపోయి ఆడటం చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు. అంతలా తిట్టుకుని అలా ఎలా కలిసిపోయారు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడమే కాదు, వ్యూహాలు రచించడం.. వాటిని అమలు పరచడం చూస్తుంటే ఏంటి ఈ మార్పు అని ముక్కున వేలేసుకుంటున్నారు. బిందు అయితే అరియానా దగ్గర కొట్టేసిన పాస్ లు తీసుకెళ్లి డైరెక్ట్ అఖిల్ చేతికి ఇచ్చేసింది. ఈ పరిణామాలు చూస్తుంటే కొందరు మంచిగా స్పందించినా ఇంకొందరు మాత్రం వరస్ట్ ఇంటి సభ్యుడు ఓటింగ్ లో అసలు విషయాలు బయట పడతాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. అఖిల్- బిందు ఈ టాస్కుతో కలిసిపోతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.