విద్యార్ధులను కన్నబిడ్డలుగా భావించి వారి ఉన్నతకి తోడ్పడే వారు గురువులు. విద్యార్ధులు చేసిన తప్పులను మన్నించి, వారిలో క్రమశిక్షణ కలిగింస్తుంటారు. ఎంతో ఒపికగా వారికి పాఠాలు బోధిస్తూ.. వారి బంగారు భవిష్యత్తుగా బాటలు వేస్తారు. అయితే నేటికాలంలో కొందరు ఉపాధ్యాయులు విద్యార్ధుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. బోధకులుగా కాకుండా పిల్లల పాలిట కీచకులు గా మారుతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అందరి ముందు చెప్పదెబ్బలు కొడుతూ కాలితో తన్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో టీచర్ తరగతి గదిలో అందరి ముందు ఓ విద్యార్ధిని నిల్చోబెట్టినాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ విద్యార్ధి పై సదరు టీచర్ కూర్రత్వం ప్రదర్శించాడు. అదే క్లాస్ రూమ్ అని మరచిపోయి విచక్షణరహితంగా వ్యవహరించారు. విద్యార్ధిని చెంపలు వాచేలా కొట్టాడు. అంతటితో ఆగని ఆ ఉపాధ్యాయుడు ఆ బాలుడిని కాలితో పలుమార్లు తన్నాడు. పాపం ఆ విద్యార్ధి సదరు టీచర్ కొట్టిన దెబ్బలకు అల్లాడిపోయాడు. ఈ దృశ్యం అంతటిని ఎవరో వీడియో తీశారు. అది కాస్తా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆ ఉపాధ్యాయుడిపై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. “ఇంత కోవ్వా.. ఆ వెధవకి, విద్యను వ్యాపారంగా మార్చిన వాడు విద్యార్ధులను సరుకుగానే చూస్తాడు” అంటూ నెటిన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sri chaithanya
Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/rGx3AfhaCG— Divakar Reddy (@Divakar_Reddy83) September 16, 2022