భారత దేశం వ్యవసాయనికి పెట్టింది పేరు. ఇక్కడి ప్రజలు పురాతన కాలం నుంచి వ్యవసాయపైనే జీవిస్తున్నారు. అనేక వినూత్న పద్దతులతో వ్యవసాయం చేసి పంటలను సమృద్ధిగా పడించేవారు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త ఉత్పత్తులు, పద్దతులను ఆవిష్కరించడంలో మన భారతీయులు ముందుంటారు. వ్యవసాయాన్ని సులభంగా మార్చేందుకు అనేక పద్దతులు కనిపెట్టారు. ఆలోచించే తత్వం ఉండాలి కానీ, ఆవిష్కరణలకు పెద్దగా చదువు అక్కర్లేదు. ఇదే విషయాన్నిచాలా సార్లు మన రైతలు నిరూపించారు. తాజాగా ఓ గ్రామీణ రైతు.. తనకు మాత్రమే కాకుండా, యావత్ రైతాంగానికి ఉపయోగపడే అద్భుతాన్ని ఆవిష్కరించాడు ఆ రైతు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ రైతు.. ట్రేడ్ మిల్ యంత్రంకి సంబంధించిన ఓ బెల్ట్ ఎద్దుల బండికి అమర్చారు. ఆ యంత్రంపై ఎద్దును నడిపిస్తూ పంటకు కావాల్సిన నీటిని తోడుతున్నారు. దీనికి ఎలాంటి కరెంట్ అవసరం లేకుండా నీటిని తోడుతున్నారు. ఎద్దు నడుస్తున్న సమయంలో బెల్డ్ ద్వారా కింద ఉన్న నీరు పైపుల ద్వారా పంటకు చేరుతుంది. దీంతో కరెంట్ లేని సమయంలో కూడా పంటకు నీరు అందిస్తున్నారు సదరు రైతు. అలాగే, మోటర్ల సాయంతో కరెంట్ ను సైతం ఉత్పత్తి చేస్తోన్నారు. అలా ఉత్పత్తి అయినా కరెంట్ ను వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ రెండు ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు అధికారి ఆ వీడియోకు ” గ్రామీణ భారత దేశ ఆవిష్కరణ. ఇది ఓ అద్భతం” అని క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రైతుల క్రియేటివిటీని ప్రశంసిస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. స్వదేశీ ఆవిష్కరణులు దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతాయంటూ ఓనెటిజన్ కామెంట్ చేశాడు. అలానే ఈ ఆవిష్కరణపై నెగిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి. జంతువులను శారీరకంగా హింసిస్తూ..దాని ఆవిష్కరణ అని పేరుపెడటం దారుణం అంటూ కామెంట్ చేశాడు. మరి.. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూుపంలో తెలియజేయండి.
RURAL INDIA Innovation. It’s Amazing!! pic.twitter.com/rJAaGNpQh5
— Awanish Sharan (@AwanishSharan) September 23, 2022