Chikoti Praveen: మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కుమార్ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈడి సోదాల్లో ప్రవీణ్ కుమార్ బాలీవుడ్, టాలీవుడ్ తారలకు రూ. లక్షల్లో పారితోషకం ఇచ్చినట్లు తేలింది. ఈడీ ప్రస్తుతం చికోటి ప్రవీణ్ కేసును విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు జంతువులంటే ఇష్టమన్న సంగతి వెలుగుచూసింది. ప్రవీణ్ తనకు జంతువుల మీద ఉన్న ప్రేమతో ఓ మినీ జూను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
రంగారెడ్డి జిల్లాలోని సాయిరెడ్డి గూడలో సుమారు 12 ఎకరాల్లో ఉన్న ప్రవీణ్ ఫాం హౌస్లో ఆ మినీ జూ ఉంది. అక్కడ అరుదైన పక్షులు, బల్లులు, పాములను పెంచుకుంటున్నాడు. తాజాగా, అటవీ శాఖ అధికారులు ఆ మినీ జూలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం చికోటి ప్రవీణ్ ఫాం హౌస్లో ఉన్న ఈ మినీ జూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి, చికోటి ప్రవీణ్ ఫాం హౌస్లో ఉన్న మినీ జూపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chikoti Praveen: క్యాసినో కేసులో సంచలనాలు.. సినీ స్టార్స్ కు ప్రవీణ్ పారితోషికాలు!