ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే పేరు వినిపిస్తోంది. అదే చికోటీ ప్రవీణ్ కుమార్.. 20ఏళ్ల క్రితం ఓ చిన్న సిరామిక్ టైల్స్ నిర్వహించేవాడు. అతడు హైదరాబాద్ లోని సైదాబాద్, వినయ్ నగర్ కాలనీలో అతని నివాసం. వ్యాపారంలో కొంత డబ్బు కూడ బెట్టాక సినీ నిర్మాతగా మారాడు. దాంతో చేతులు కాల్చుకుని అప్పుల ఊబిలో చిక్కుకు పోయాడు. ఆ టైమ్ లో ఓ వైద్యున్ని కిడ్నాప్ చేసి జైలుకు సైతం వెళ్లాడు. తర్వాత తన మకాం గోవాకు మార్చాడు ప్రవీణ్. అక్కడ కేసినోలో కొన్ని టేబుళ్లను లీజుకు తీసుకున్నాడు. దాంతో అతని కేసినో ప్రస్థానం మెుదలైంది. అలా మెుదలైన అతని చీకటి ప్రస్థానం దాదాపు 10 దేశాల్లో విస్తరించింది అంటేనే అతని సామ్రాజ్యం ఎంత ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అతడు 'బిగ్ డాడీ' పేరుతో నేపాల్.. శ్రీలంక.. ఇండోనేషియా.. థాయిలాండ్ తదితర దేశాల్లో క్యాసినో నిర్వహించేవాడు. ఏపీలో ఆ మధ్య నిర్వహించిన భారీ క్యాసినో వెనుక ప్రవీణ్ హస్తం ఉందని చెబుతారు. అలాగే విదేశాల్లో జరిగే క్యాసినోలకు ప్రముఖులను ప్రత్యేక హెలికాప్టర్లలో తరలించేవాడు. ఇదీ చూస్తూనే అతని రేంజ్ ఏపాటిదో అర్థం అవుతోంది. అయితే తాజాగా ఈడి సోదాల్లో ప్రవీణ్ కుమార్ బాలీవుడ్, టాలీవుడ్ తారలకు రూ. లక్షల్లో పారితోషకం ఇచ్చినట్లు తేలింది. దానికి సంబంధించిన లిస్ట్ ఇదే. బాలీవుడ్ కు చెందిన నటుడు గోవిందకు రూ. 50 లక్షలు, మల్లికా శరావత్ కు రూ.కోటి, ముమైత్ ఖాన్ కు 15 లక్షలు, అమీషా పటేల్ కు రూ.80 లక్షలు, డింపుల్ హయాతీకు రూ.40 లక్షలు , గణేశ్ ఆచార్యకు రూ. 20 లక్షలు, ఈషా రెబ్బకు రూ.40 లక్షలు ఇచ్చినట్లు ఈడి సోదాల్లో బయట పడింది. దాంతో వారి పారితోషకాలపై నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.