ఈ ఆధునిక సమాజంలో కూడా నిత్యం ఎక్కడో ఒక చోట లింగ వివక్షతో ఆడవారిపై వేధిపులు జరుగుతున్నాయి. ఆడబిడ్డను కన్నందుకు, అదనపు కట్నం తీసుకురావాలంటూ చిత్రహింసలు పెట్టే ఘటనలు అనేకం చూస్తున్నాం. కానీ ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు భారం కాదు.. భరోసా అని భావించే రోజులు కూడా వచ్చాయాని ఓ కుటుంబాన్ని చూస్తే అనిపిస్తుంది. గర్భిణీగా వెళ్లిన కోడలు పండంటి ఆడబిడ్డను ప్రసవించిందని తెలిసి భర్త, అత్త,మామలు సంబరపడిపోయి తల్లీ,బిడ్డలకు ఘనంగా స్వాగతం పలికారు. తాజాగా ఈ ఘటన తెలంగాణ జిల్లా జగిత్యాల లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మెట్టుపల్లికి చెందిన మోటూరి శ్రావణ్, అశ్విని దంపతులు. వీరికి మొదటి సంతానంగా పాప పట్టింది. ఇటీవల రెండవ సంతానంగా మళ్ళీ పాప పుట్టింది. చాలా మంది ఇలా వరుసగా రెండో సారి పాప పుడితే నిరాశ చెందుతారు. కానీ ఆ కుటుంబం మాత్రం ఎలాంటి నిరాశ చెందకుండా తమ ఇంటికి శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మి వచ్చిందంటూ సంబరాలు చేసుకున్నారు. తల్లి, బిడ్డకు భర్త, అత్త మామ ఘనస్వాగతం పలుకుతూ ఇల్లంతా పూలతో అలంకరించారు. ఇంటికి మహాలక్ష్మిని తీసుకొస్తున్న సందర్భంగా కోడలితో పాటు మనవరాలికి మంగళ హరతులు ఇచ్చి మరీ ఇంట్లోకి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వారికి స్వీట్లు పంచారు. ఆడబిడ్డను కంటే కోడల్ని రాచి రంపాన పెడుతున్న ఈరోజుల్లో రెండో కాన్పులో కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చిన కోడలికి ఆత్మీయ,అనురాగాలతో స్వాగతం పలకడం చూసి అందరూ హర్షిస్తున్నారు.
అంతే కాదు ఆడపిల్ల ఎప్పుడూ ఇంటికి భారం కాదని మహాలక్ష్మి అని ప్రతి ఒక్కరు భావించాలని శ్రావణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే శ్రావణ్ సోదరికి కూడా ఇద్దరూ ఆడ సంతానమే. అయినప్పటి వారి తల్లిదండ్రులు ఎలాంటి విచారం చెందకుండా సంతోషం పంచడం గొప్ప విషయమని స్థానికులు అంటున్నారు. తమ ఇద్దరు బిడ్డలకు నలుగురు ఆడపిల్లలు పుట్టినప్పటికి ఎంతో సంతోషంగానే ఉన్నామన్నారు శ్రావణ్ తల్లిదండ్రులు. మరి.. ఆడబిడ్డలను అదృష్టంగా భావిస్తున్న ఈ కుటుంబంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ‘ఠాగూర్ సినిమా సిన్’ని చూపించిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి వైద్యులు!
ఇదీ చదవండి: జగిత్యాలలో దారుణం.. అల్లుడి పై కత్తితో దాడికి పాల్పడిన మామ..