పెట్రో ధరలు అంతకంతకు పెరుగుతుండడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో మానవాళి ద్రుష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. ప్రభుత్వాలు సైతం ఈ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో.. వాహన తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గుచూపుతున్నాయి. చూస్తుంటే.. భవిష్యత్ మార్కెట్ అంతా విద్యుత్ వాహనాలతోనే నిండిపోయే అవకాశం ఉంది. ఆ దిశగానే ఆలోచనలు చేశారు మహీంద్రా అధినేత.. ఆనంద్ మహీంద్రా. అందులో భాగంగా ఐదు ఎలక్ట్రిక్ SUVలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
వినియోగదార్లలో అవగాహన పెరగడానికి తోడు ప్రభుత్వ మద్దతు నేపథ్యంలో.. విద్యుత్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నామని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. దేశీయ, అంతర్జాతీయ విపణుల కోసం 5 ఎలక్ట్రిక్ ఎస్యూవీలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. తొలి వాహనం 2024 ఆఖరుకు విడుదలవుతుందని, మొత్తంమీద 2024-26 వరకు 4 ఎలక్ట్రిక్ ఎస్యూవీలు రోడ్లపైకి రావొచ్చని తెలిపారు.
5 new electric SUVs from @MahindraRise. All based on the new #INGLO platform.
-XUV.e8
-XUV.e9
-BE.05
-BE.07
-BE.09
The 2 electric XUVs will come first, e8 in 2024 and e9 in 2025. The rest will follow. Electric components will come through a tie-up with Volkswagen. pic.twitter.com/kASKlWOJ49— Dipayan Dutta (@dipayandutta) August 16, 2022
మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన విభాగం ఈవీ కోలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ సుముఖంగా ఉందట. తమ కంపెనీలో 250 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 1,925 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు బీఐఐ రెడీగా ఉందని ఆనంద్ మహీంద్రా ఇప్పటికే వెల్లడించారు. ఈ కంపెనీలో మొత్తం 1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 7,900 కోట్ల రూపాయలను మహీంద్రా కంపెనీ, బీఇఇ సంయుక్తంగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మొత్తాన్ని 2024-27 మధ్యలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో సహకారం అందించేందుకు ఫోక్స్వ్యాగన్తో మహీంద్రా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. మహీంద్రా కంపెనీ, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ కంపెనీలు సంయుక్తంగా ఇంగ్లో ఫ్లాట్ ఫామ్ మీద తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మ్యాట్రిక్స్(ఎంఈబీ) ఎలక్ట్రిక్ ఎక్యుప్ మెంట్స్ ను ఫోక్స్ వ్యాగన్ అందించనుంది. ప్రధానంగా 2026 వరకు మార్కెట్లోకి రానున్న 5 ఎలక్ట్రిక్ SUVలకు ఈ కంపెనీ ఎంఈబీ ఎక్యుప్ మెంట్స్ ను సమకూర్చనుంది.
Futuristic design, pulsating performance and dynamic innovation. Welcome to a reimagined world of electric SUVs. #WorldPremiere #BornElectricVision Know more: https://t.co/YxICf0H3Rb https://t.co/ESIUP63lM4
— Mahindra Born Electric (@born_electric) August 15, 2022
ఇదీ చదవండి: మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ‘ఓలా ఎలక్ట్రిక్ కార్’.. నాలుగు సెకన్లలో 100 కి.మీ స్పీడ్!
ఇదీ చదవండి: వోల్వో తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు XC40 లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ!