నవంబర్ 10, 2022 టీమిండియా క్రికెట్ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచ కప్ కొట్టాలని భారత్ జట్టు ఆస్ట్రేలియ గడ్డపై అడుగు పెట్టింది. సూపర్ 12 మ్యాచ్ ల్లో అద్బుత ప్రదర్శన చేసి సెమీస్ కు కూడా చేరుకుంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజాలందరు టీమిండియానే కప్ కొట్టబోతోందని జోస్యం చెప్పారు. కానీ అందరి అంచనాలను వమ్ము చేస్తు.. సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ ఏడ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
టీ20 వరల్డ్ కప్ 2022 టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా కు చుక్కెదురైంది. సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీమిండియా ఓటముల్లో ఇది అత్యంత చెత్త ఓటమిగా రికార్డుల్లోకి ఎక్కింది. సూపర్ 12 మ్యాచ్ ల్లో మెరిసిన భారత బౌలర్లు కీలక మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు అనడానికి ఇంగ్లాండ్ బ్యాటర్ల ఊచకోతే ఓ ఉదాహరణ. 16 ఓవర్లు వేసిన టీమిండియా బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేక పోయిన కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటి పర్యంతం అయ్యాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ కుర్చిలో కూర్చుని కన్నీరు తుడుచుకుంటూ కనిపించాడు. అతడి ముఖం మెుత్తం తీవ్రమైన వేదనతో కనిపించింది.
Please god, I’m begging, give me all the pain of my @ImRo45, but pls don’t do this to him. 🙏💔😭pic.twitter.com/zHeoTOB6kW
— Vishal. (@SportyVishal) November 10, 2022
ఏ ఆటగాడికైన దేశం తరపున ఆడుతున్నప్పుడు భావోద్వేగంతో కుడుకున్న ఒత్తిడి ఉంటుంది. పైగా అది ప్రపంచ కప్ లాంటి మెగాటోర్నీల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి మ్యాచ్ ల్లో అనుకున్నట్లుగా ఫలితం రాకపోతే ఏ ఆటగాడైనా భావోద్వేగానికి గురవ్వడం సహజమే. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే? రోహిత్ ఇంతకు ముందెన్నడూ ఇలా కన్నీరు కార్చడం చూల్లేదు. టీమిండియా ఫ్యాన్స్ సైతం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ బాధను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.