టీమిండియా దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ భార్య డోనా ఆసుపత్రిలో చేరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండ్రోజుల క్రితం ఆమెకు తీవ్రమైన గొంతు నొప్పి, దగ్గు రావడంతో కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ.. వైద్యులు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
మంగళవారం రాత్రి డోనాకు విపరీతమైన గొంతునొప్పి, దగ్గు రావడంతో హుటాహుటీన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వెంటనే వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా.. చికెన్ గున్యా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు.. వుడ్ల్యాండ్స్ హాస్పిటల్ ఎండీ, సీఈఓ డాక్టర్ రూపాలి బసు తెలిపారు. అయితే.. ఆమె ఆసుపత్రికి వెళ్లే సమయంలో గంగూలీ ఆమె వెంట లేనట్లుగా ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న దాదా వైద్యులతో మాట్లాడినట్లు తెలిపింది. ప్రస్తుతం గంగూలీ కూతురు సోనా లండన్లో చదువుకుంటోంది. దీంతో డోనా డిశ్చార్జ్ అయిన తర్వాత సోనా భారత్కి వచ్చే అవకాశం ఉన్నట్లు దాదా కుటుంబ సభ్యులు తెలిపారు. డోనా.. ఒడిశా సంప్రదాయ నృత్యకారిణి. ఆమె ఇప్పటికే చాలా చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
“Dona Ganguly has been diagnosed to be suffering from Chikungunya. She remains haemodynamically stable and afebrile, and is on maintenance IV fluids,” Woodlands Hospital MD and CEO Dr Rupali Basu said.https://t.co/Q7YDUTJ24y
— Express Sports (@IExpressSports) October 5, 2022