టీమిండియా పేస్ బౌలర్లలో ఏమాత్రం పస ఉండేది కాదని.. అందుకే తమ ఓపెనర్లు హెల్మెట్ లేకుండా ఆడేవారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో గొప్ప బౌలర్లు ఉన్నా.. బ్యాటర్లను భయపెట్టే పేసర్లు మాత్రం లేదని, అసలు వారి పేస్లో పస ఉండేది కాదని బట్ అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ దిగ్గజ బ్యాటర్లుగా ఉన్న సయీద్ అన్వర్, ఆమీర్ సోహైల్ హెల్మెట్ కూడా ధరించకుండానే ఇండియన్ బౌలర్లను ఎదుర్కొనే వారని అన్నాడు. ఆ టైమ్లో టీమిండియా పేసర్లు వేసే బంతులను ఓపెనర్లుగా వచ్చే అన్వర్, సోహెల్ సునాయసంగా స్పిన్నర్లు ఆడినట్లు ఆడే వారంటూ పేర్కొన్నాడు.
సాధారణంగా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్ల బౌలింగ్కు వచ్చిన సమయంలో మాత్రమే బ్యాటర్లు హెల్మెట్ తీసి ఆడేవారు. కానీ.. టీమిండియా పేసర్లు బౌలింగ్ వేస్తున్నా.. పిచ్ ఎలా స్పందిస్తుందో అనే భయం కూడా లేకుండా పాక్ ఓపెనర్లు హెల్మెట్ లేకుండా ఆడేవారు. ఇదే విషయాన్ని బట్ కొంత వెటకారంగా చెప్పాడు. అన్వర్, సోహైల్ సమయంలో టీమిండియాలో వెంకటేశ్ ప్రసాద్, శ్రీనాథ్ వంటి పేసర్లు జట్టులో ఉన్నా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బౌనర్లు వేసేవారు కాదు. పేస్ కూడా పెద్దగా ఉండేది కాదు. ఈ కారణంగానే పాక్ ఓపెనర్లు హెల్మెట్లు పెట్టుకునే వారు కాదని కొంతమంది నెటిజన్లు సల్మాన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ అసలు విషయాలు వెల్లడిస్తున్నారు.
Aamir Sohail and Saeed Anwar used to hit Indian bowlers wearing caps, Salman Butt https://t.co/OLkqELIMyT
— hoshyarpakistan (@hoshyarpakistan) October 12, 2022
ఇది కూడా చదవండి: గంగూలీని కావాలనే అవమానిస్తున్నారా? దాదాపై దారుణమైన స్కెచ్!