ప్రపంచ క్రికెట్లో పెద్దగా ఒడిదుడుకులు లేకుండా.. ఎప్పుడూ ఒక మంచి టీమ్గా ఆకట్టుకుంటూ ఉంటుంది న్యూజిలాండ్. టీ20ల్లో అయితే ఆ జట్టు ఒక ఛాంపియన్ టీమ్లానే గట్టి పోటీ ఇస్తుంది. కానీ.. తాజా ఘటనతో న్యూజిలాండ్ నవ్వుల పాలవుతోంది. పైగా నెటిజన్లు పాకిస్థాన్ ఫీల్డింగ్తో న్యూజిలాండ్ ఫీల్డింగ్ని పోల్చుతూ.. ట్రోల్ చేస్తున్నారు. చెత్త ఫీల్డింగ్కు పెట్టింది పేరైన పాకిస్థాన్తో కంప్యార్ చేసేంత పెద్ద తప్పు న్యూజిలాండ్ ఏం చేసిందంటే.. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా ఒక సునాయాసమైన క్యాచ్ను నేలపాలు చేసింది. ఎన్నో అద్భుతమైన క్యాచ్లు అందుకున్న ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ లాంటి ప్లేయర్లు ఈ క్యాచ్ డ్రాప్లో భాగమైయ్యారు. వారు వదిలేసిన తీరు.. గతంలో ఇద్దరు పాక్ ఆటగాళ్ల మధ్య బాల్ పడి క్యాచ్ మిస్ అయిన సంఘటనను గుర్తుకు తెచ్చింది.
అంతే ఇక నెటిజన్లు ఊరుకుంటారా.. పాక్ను మించిపోయిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ అంటూ ఏకిపారేస్తున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్తో న్యూజిలాండ్ స్వదేశంలో ట్రై సిరీస్ ఆడుతోంది. టీ20 వరల్డ్ కప్ 2022 లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు ఈ ట్రై సిరీస్ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలతో న్యూజిలాండ్ టేబుల్ టాపర్గా ఉంది. కాగా.. బుధవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో.. బంగ్లా బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ షాట్ మిస్టైమ్ అయి బంతి నిటారుగా గాల్లోకి లేచింది.
బంతి చాలా పైకి వెళ్లడంతో క్యాచ్ కోసం.. బౌలర్ బౌల్ట్, కవర్స్ నుంచి గ్లెన్ ఫిలిప్స్, మిడ్ వికెట్ నుంచి టీమ్ సౌథీ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ.. ఎవరూ క్యాచ్ను అందుకోకుండా.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు. దీంతో క్యాచ్ నేలపాలైంది. ఒకరు తీసుకుంటారని మరొకరు భావించి.. సింపుల్ క్యాచ్ను వదిలేశారు. ఈ క్యాచ్ డ్రాప్ను గతంలో పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్-సయీద్ అజ్మల్ ఒక సింపుల్ క్యాచ్ నేలపాలు చేసిన ఘటనతో ఇప్పుడు ఈ క్యాచ్ను పోల్చుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చరచ్చ చేస్తున్నారు.
— SnEhA KuMaR ReDdY (@snehakumarreddy) October 12, 2022
Its just about being iconic
Like this is one of the most iconic of all time pic.twitter.com/Hc7c7vFTJ7
— Lovish¹⁸//#OreoEra (@Lovishjain2004) October 12, 2022