స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత బౌలర్లు విజృభించారు. తిరువనంతపురం, గ్రీన్ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టును యువ పేసర్లు దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్ ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా అర్షదీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సఫారీ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ఫలితంగా 20 ఓవర్లు ముగిసేసరికి బాల్ కు పరుగు లెక్కన కూడా చేయలేకపోయింది.. ప్రొటీస్ జట్టు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టును అనుకున్న ఆరంభం లభించలేదు. పిచ్ నుంచి సహకారం లభించడంతో అద్భుతమైన స్వింగ్ డెలివరీలు వేసిన దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్.. సఫారీ బ్యాటర్లను పెవిలియన్ దారి చూపుతూనే వచ్చారు. క్వింటన్ డీకాక్(1), బావుమా (0), రూసో (0), డేవిడ్ మిల్లర్ (0), స్టబ్స్ (0) వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. ఒకానొక సమయంలో కొత్త బ్యాటర్లకు ప్యాడ్స్ కట్టుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఆట ప్రారంభమైన తొలి 15 బంతుల్లోనే 5 కీలక వికెట్లు కోల్పోయింది.. సఫారీ జట్టు.
Arshdeep Singh picked three wickets in an over on his return to the side.#INDvSA | @arshdeepsinghh pic.twitter.com/KxXv0MYOzs
— CricTracker (@Cricketracker) September 28, 2022
ఆసియా కప్ 2022లో పాకిస్తాన్ పై ఓటమితో విమర్శలకు కారకుడైన అర్షదీప్.. ఈ మ్యాచులో సఫారీ బ్యాటర్లను చావుదెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సఫారీ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ ముగిసేసరికి పర్యాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. సఫారీ కెప్టెన్ కేశవ్ మహారాజ్(41; 35 బంతుల్లో 5*4, 6*2) హైయెస్ట్ స్కోరర్. భారత బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు తీయగా, దీపక్ చాహర్ 2 , హర్షల్ పటేల్ 2, అక్సర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.
Here’s how the Proteas were reduced to 9-5 in 2.3 overs by India.
Aiden Markram and Wayne Parnell are currently working on rescuing the innings 🛟 #INDvSA pic.twitter.com/wOkrWQHFHO
— Superbru (@Superbru) September 28, 2022