పిల్లలు మంచి ఉన్నత స్థితికి ఎదిగినప్పుడు తల్లిదండ్రలకు కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అలానే ఓ యువతి తల్లిదండ్రులు.. తమ కూతురుని ఎంతో కష్టపడి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా తీర్చిదిద్దారు. ఆ యువతి కూడా తల్లిదండ్రుల కష్టాలను దగ్గర నుంచి చూసింది కాబట్టి.. ఎంతో శ్రమించి జాతీయ స్థాయి క్రీడల్లో మంచి గుర్తింపు సంపాదించింది. అంతే కాక జాతీయ జట్టుకే నాయత్వం వహించింది. ఆ యువతి పేరు ప్రఖ్యాతలు చూసి.. ఇక వాళ్ల కుటుంబ కష్టాలు తీరినట్లే అని, వారు సుఖంగా ఉండి ఉంటారని అందరూ భావిస్తారు. కానీ అలానే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకుంటే ఆ యువతి పేరుతో ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డుపనుల్లో ఆమె తల్లిదండ్రులే కూలీలుగా చేరి పూట గడుపుకుంటున్నారు. అసలు ఆ యువతి ఎవరు? ఆమె కుటుంబ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
జార్ఘండ్ కు చెందిన అష్టమ్ ఒరాన్.. ఫిపా అండర్-17 మహిళ వర్డల్ కప్ లో భారత్ జట్టుకు నాయకత్వం వహించింది. అద్భుతమైన ఆటతో ఫుట్బాల్ టీమ్ కెప్టెన్గా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. అష్టమ్ ఒరాన్ ఝార్ఖండ్లోని గుమ్లా అనే ఓ మారుమూల ప్రాంతానికి చెందిన యువతి. కూలీ పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి ఆమె కుటుంబానిది. గంజి నీళ్లతోనే కడుపు నింపుకునే స్థితిలో ఉన్నప్పటికి తమ కుమార్తె కల నెరవేరాలని ఆ తల్లిదండ్రులు ఆశించారు. వారి రోజువారీ కూలీకి వెళ్లి ఆ వచ్చిన సంపాదనతోనే కుమార్తె అవసరాలు తీర్చేవారు. అష్టమ్ కి ఫుట్ బాల్ అంటే ఆసక్తి. బాల్యం నుంచే కష్టాలకు అలవాటు పడిన అష్టమ్ కష్టబడి ఫుట్బాల్ నేర్చుకుంది. జాతీయ ఫుట్ బాల్ జట్టులో చోటు సంపాదించింది. చివరకు ఫిఫా అండర్-17 మహిళ ప్రపంచకప్లో ఇండియా టీమ్ కు నాయకత్వం లభించింది.
ఇప్పుడు అష్టమ్ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. ఎంతోమంది ప్రముఖులు సైతం ఆమెను అభినందిస్తున్నారు. అయితే కూతురికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్నప్పటికి.. ఆ కుటుంబ పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు. కనీసం కూతురు ఆటను చూసేందుకు వారింట్లో టీవీ కూడా లేదు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వారి ఓ టీవీ కానుకగా ఇచ్చారు. అష్టమ్ ఒరాన్ గౌరవ సూచికగా ఆమె ఇంటి నుంచి ఊరి వరకు రహదారి నిర్మాణం పనులు కూడా ప్రారంభించారు. కొన్నాళ్లుగా ఆ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే.. తమ కూతురి పేరిట నిర్మిస్తున్న రహదారి పనుల్లో కూలీలుగా మారారు ఆ తల్లిదండ్రులు. మట్టి తవ్వి ఎత్తి పోస్తున్నారు. రోజు కూలీ కింద వారు రూ.250 చొప్పున తీసుకున్నారు. అయితే ఈ విషయంపై అధికారులు స్పందించారు.
అష్టమ్ తల్లిదండ్రులు ఆ రోడ్డు నిర్మాణంలో కూలి పనులు చేస్తున్న సంగతి తనకు తెలియదని గుమ్లా డిప్యూటీ కమిషనర్ సుశాంత్ గౌరవ్ అన్నారు. ఇక అష్టమ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ… తమ కూతురు జాతీయ స్థాయికి ఎదిగిన తమ పరిస్థితి మారదలేదని, పూట గడవాలంటే తాము ఈ పని చేయక తప్పట్లేదని వారు తెలిపారు. అష్టమ్కు మంచి ఉద్యోగం వస్తే తాము ఈ పని చేయడం మానేస్తామని అష్టమ్ తల్లిదండ్రులు చెప్పారు. తాను కూడా ఒకప్పుడు ఫుట్బాల్ ప్లేయర్నేని.. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆటకు దూరమయ్యానని అష్టమ్ తండ్రి తెలిపారు. అయితే తన కలను కుమార్తె నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.